IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ ఫైనల్లో నేడు భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా మూడోసారి ట్రోఫీని గెలుచుకుంటుందని భావిస్తున్నారు. న్యూజిలాండ్ జట్టు ఇప్పటివరకు రెండు ఐసీసీ సిరీస్ లను గెలుచుకుంది. ఈ రెండూ భారత్ పైనే కావడం గమనార్హం. ఇది న్యూజిలాండ్కు మూడోసారి అదృష్టం కలిసి వస్తుందా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది.
ఈ పరిస్థితిలో ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్లు చాట్జీపీటీ, జెమిని, క్రూక్ వంటి ఏఐ ప్లాట్ఫామ్లు భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో అంచనా వేశాయి. గూగుల్కు చెందిన జెమిని ఏఐ ప్లాట్ఫామ్ విడుదల చేసిన అంచనా ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో గెలిచే అవకాశం భారత్ కు ఎక్కువగా ఉంది. భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్, ఇటీవల ఐసీసీ సిరీస్లలో టీమిండియా ప్రదర్శనలను దీనికి కారణాలుగా పేర్కొంటూ.. ఈ ఫైనల్ లో ఏదైనా జరగవచ్చని అంచనా వేసింది.

చాట్జీపీటీ ప్రకారం..
అదే విధంగా చాట్జీపీటీ కూడా భారత్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. చాట్జీపీటీ విడుదల చేసిన అంచనా ప్రకారం.. భారత జట్టు అపజయం లేకుండా ఫైనల్ కు చేరుకుందని పేర్కొంది. భారత జట్టు న్యూజిలాండ్ పై లీగ్ మ్యాచ్ లో విజయం సాధించిందని.. టీమిండియా కీలక ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉన్నారని చాట్జీపీటీ తెలిపింది. దుబాయ్ పిచ్ స్పిన్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుందని.. భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉన్నారని కూడా ప్రస్తావించింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా ఉండొచ్చని చాట్ జీపీటీ అంచనా వేసింది.
క్రూక్ ప్రకారం..
ఎలన్ మస్క్ కు చెందిన క్రూక్ ఏఐ ప్లాట్ఫామ్ అంచనాల ప్రకారం.. ఈ సిరీస్ లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. సెమీఫైనల్లో భారత్ బలమైన ఆస్ట్రేలియాను ఓడించింది. టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ మంచి స్థితిలో ఉన్నందున భారత జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రూక్ అంచనా వేసింది. ఏఐ భవిష్యత్ ను అంచనా వేయగల వేదిక కాదని.. క్రికెట్ లో ఏదైనా జరగవచ్చని క్రూక్ పేర్కొంది.