లీడ్స్: ప్రపంచకప్లో భాగంగా లీడ్స్లోని హెడింగ్లేలో శ్రీలంకతో ఆరంభమైన మ్యాచ్లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఆల్రౌండర్ ఓ మైలురాయిని అందుకోబోతున్నారు. దీనితో మొయిన్ అలీ వంద మ్యాచ్ల క్లబ్లో చేరబోతున్నాడు. ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య లీడ్స్లో ఈ మ్యాచ్ మరి కాసేపట్లో ఆరంభం కాబోతోంది. మొయిన్ అలీకి తుది జట్టులో చోటు దక్కింది. బ్యాట్స్మెన్గా, ఆఫ్ స్పిన్నర్గా మొయిన్ అలీ ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్గా ఎదిగాడు. 2014లో వన్డే మ్యాచ్ ఆడటం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన ఆయన.. ఇంగ్లండ్ సాధించిన పలు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ఏడో స్థానం అతనిదే..
మిడిలార్డర్లో చివరి బ్యాట్స్మెన్గా మొయిన్ అలీకి పేరుంది. వికెట్ల పతనాన్ని అడ్డుకుని, వేగంగా బ్యాటింగ్ చేయగలడనే ఉద్దేశంతోనే అతణ్ని ఎప్పుడు కూడా ఏడో స్థానంలో బరిలో దింపుతుంది ఇంగ్లండ్ టీమ్ మేనేజ్మెంట్. చాలా సందర్భాల్లో టీమ్ మేనేజ్మెంట్ ఆశలను నిలబెట్టాడతను. జాతీయ జట్టుకు వందో మ్యాచ్ ఆడబోతుండటం తనకు నమ్మశక్యంగా లేదని అలీ వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఎంపిక కావడం, కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని తాను కలలు గన్నానని, అలాంటిది ఇప్పుడు ఏకంగా వందో మ్యాచ్ ఆడబోతుండటం పట్ల తనకు ఆనందంగా ఉందని అన్నారు.
టీమిండియాస్ డే అవుట్! పిల్లలతో పిల్లలుగా.. సరదాగా!
ఒత్తిడితో కూడుకున్న స్థానం..
క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత.. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే- జాతీయ జట్టులో చోటు చేసుకున్న అనేక పరిణామాలు, మలుపులు, ఘన విజయాల్లో తానూ ఓ భాగస్వామిని కావడం గొప్ప విషయమని మొయిన్ అలీ చెప్పారు. జట్టులో ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగడం సులభతరం కాదని అన్నారు. ఆ సమయంలో బ్యాటింగ్కు దిగాల్సి రావడం ఒత్తిడితో కూడుకున్న విషయమని అన్నారు. జట్టు టాప్ ఆర్డర్, మిడిలార్డర్ బ్యాట్స్మెన్లు విఫలమైతేనే ఏడో స్థానంలో ఉండే బ్యాట్స్మెన్కు అవకాశం వస్తుందని, అలాంటి పరిస్థితుల్లోక్రీజులో పాతుకుని ఉండి, జట్టును గట్టెక్కించాల్సిన బాధ్యత ఉంటుందని అన్నారు. దీనికి తాను న్యాయం చేస్తున్నాననే అనుకుంటున్నానని చెప్పారు.