
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫస్ట్ రౌండ్కు క్వాలిఫైయర్ మ్యాచ్లో నెదర్లాండ్స్ను ఓడించి జింబాబ్వే తన బెర్త్ కన్ఫాం చేసుకుంది. తద్వారా గ్రూప్ బీలో ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్లతో పాటు జింబాబ్వే కూడా స్థానం సంపాదించింది. తద్వారా టీ20 ప్రపంచకప్ ఆడే టీంలు ఖరారయ్యాయి. ఇకపోతే అక్టోబరు 16నుంచి నవంబర్ 13వరకు ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. మొత్తం ఏడు నగరాల్లోని స్టేడియాల్లో ప్రపంచకప్ టోర్నీ జరగబోతుంది. ఇక ఫస్ట్ రౌండ్ మ్యాచ్లు జీలాంగ్, హాబర్ట్ వేదికగా జరగనున్నాయి. ఇకపోతే నెదర్లాండ్స్తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో తొలుత జింబాబ్వే 132పరుగులు చేయగా.. నెదర్లాండ్స్ 95పరుగులకే ఆలౌటైంది. తద్వారా 37పరుగుల తేడాతో జింబాబ్వే గెలుపొందింది. ఆ జట్టు ప్లేయర్ సికిందర్ రాజా బ్యాటింగ్లో విలువైన 19పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 4వికెట్లు తీసి సత్తా చాటి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
ఫస్ట్ రౌండ్లో జట్లు
గ్రూప్ A: నమీబియా, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్
గ్రూప్ B: ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే
సూపర్ 12
గ్రూప్ 1: ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, విజేత గ్రూప్ A, రన్నరప్ గ్రూప్ B
గ్రూప్ 2: భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, రన్నరప్ గ్రూప్ ఎ, విజేత గ్రూప్ బి