న్యూఢిల్లీ: ఢిల్లీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్ పైన చేసిన ట్వీట్లను యోగేశ్వర్ దత్ సమర్థించుకున్నారు. ఆమె ఒక అమరవీరుడి కుమార్తె.. తాను ఆమెకు వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు.
కేవలం ఆమె అభిప్రాయాలతో విభేదించానని తెలిపారు. భారత జవాన్లను పాకిస్థాన్ కాకపోతే ఎవరు చంపినట్లు అని ఆయన ప్రశ్నించారు. మనం పాకిస్థాన్తో యుద్ధం చేస్తున్నాం.. అవునా కాదా..? అని నిలదీశారు.

తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధం చంపిందని గుర్మెహర్ కౌర్ ఏడాది క్రితం పోస్టు చేసిన వీడియోపై వీరేంద్ర సెహ్వాగ్ ఒక పోస్టు పెట్టారు. ఆయనకు మద్దతుగా యోగేశ్వర్దత్ కూడా నిన్న ట్విటర్లో ఒక పోస్టర్ను ట్వీట్ చేశారు. దీనిపై ఆయన నేడు వివరణ ఇచ్చారు. అంతకుముందు సెహ్వాగ్ కూడా తన ట్వీట్ పైన వివరణ ఇచ్చారు.