
శ్రీలంక 5వ స్థానం నుంచి 3వ స్థానానికి..
ప్రస్తుతం శ్రీలంక ఏకంగా 5వ స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకుంది. ఇక ఈ మ్యాచ్ ఫలితం వల్ల భారత్కు బొక్క పడింది. భారత్ 3వ స్థానం నుంచి ఏకంగా అయిదో స్థానానికి పడిపోయింది. శ్రీలంక (54.17), పాకిస్థాన్ (52.38) మూడు, నాలుగో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇండియా (52.08)విన్నింగ్ పర్సంటేజీతో అయిదో స్థానానికి దిగజారింది. ఇక ఇంతకుముందు ఉన్నట్టే పాకిస్థాన్ నాలుగో స్థానంలోనే కొనసాగుతుంది.

మిగతా స్థానాల్లో..
ఇక డబ్ల్యూటీసీ 2021-23లో నాలుగు విజయాలతో వెస్టిండీస్ 6వ స్థానంలో కొనసాగుతుంది. ఇక 16మ్యాచ్ల్లో 5 విజయాలతో ఇంగ్లాండ్ 7వ స్థానంలో నిలవగా.. తొమ్మిది మ్యాచ్ల్లో 2 విజయాలతో న్యూజిలాండ్ అట్టడుగు నుంచి రెండో స్థానంలో (8వ) స్థానంలో ఉంది. ఇక బంగ్లాదేశ్ పది మ్యాచ్ల్లో ఒక విజయం, డ్రాతో అట్టడుగు స్థానంలో (9వ స్థానం) తిష్ట వేసుకుని కూర్చుంది.

తిప్పేసిన ప్రభాత్ జయసూర్య
ఇక ఆసీస్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ విషయానికొస్తే.. ముందుగా తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. మార్నస్ లాబుషేన్, స్టీవ్ స్మిత్ సెంచరీలతో తొలి ఇన్నింగ్స్లో 110ఓవర్లలో 364పరుగులు చేసింది. లాబుషేన్ 104పరుగుల వద్ద అవుట్ కాగా.. స్మిత్ 145పరుగులతో కడవరకు క్రీజులో అజేయంగా నిలిచాడు. ఇక శ్రీలంక బౌలర్లలో ఎడమచేతి వాటం ఆర్థోడాక్స్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య 6వికెట్లు పడగొట్టి అరంగేట్ర మ్యాచ్లోనే అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఇక శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 181ఓవర్లలో 554పరుగులు చేసింది. ఇందులో నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేయగా.. దినేష్ చండిమాల్ తన తొలి డబుల్ సెంచరీ (206పరుగులు నాటౌట్) చేశాడు. దీంతో 190పరుగుల భారీ ఆధిక్యం శ్రీలంకకు దక్కింది. అయితే మరోసారి ప్రభాత్ జయసూర్య ఆరు వికెట్లతో చెలరేగడంతో (మొత్తం 12వికెట్లు) ఆస్ట్రేలియా 41ఓవర్లలో 151పరుగులకు ఆలౌటైంది. దీంతో శ్రీలంక గెలుపొందింది.


Click it and Unblock the Notifications
