టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని జవహర్ విద్యా మందిర్లో కుటుంబ సభ్యులతో ధోనీ ఓటు వేశారు. క్యూ లైన్ లో నిలబడి మరీ ధోనీ ఓటు వేశారు. ధోనీతో పాటు అతని భార్య సాక్షి సింగ్, కూతురు జీవాలు ఉన్నారు.
ఓటు వేసిన అనంతరం పోలింగ్ కేంద్రం బయట ఎంఎస్ ధోనీతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఓటు వేసిన అనంతరం ఇంస్టాగ్రామ్ వేదికగా ధోనీ కూతురు జీవాతో ఓ సందేశం చెప్పించారు. 'మా మమ్మి, పప్పా లాగా అందరు వెళ్లి ఓటు వేయండి' అని జీవా తన ముద్దు మాటలతో చెప్పింది. పక్కనే ఉన్న ధోనీ 'ఎస్' అని మురిసిపోయారు. ఈ వీడియో చూసి ధోనీ అభిమానులు తెగ సంబరపడుతున్నారు.
గత కొద్ది రోజులుగా ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతూ ఎంఎస్ ధోనీ బిజీబిజీగా ఉన్నారు. మొహాలీ వేదికగా ఆదివారం పంజాబ్, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం ధోనీ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాంచీకి చేరుకున్నారు. చెన్నైప్లే ఆఫ్ చేరుకున్న విషయం తెలిసిందే. మంగళవారం చెన్నై వేదికగా ముంబై, చెన్నై జట్ల మధ్య క్వాలిఫైయర్ -1 మ్యాచ్ జరగనుంది.