హైదరాబాద్: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 304 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత కోహ్లీ సేన స్విమ్మింగ్ పూల్లో సేద తీరారు. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా లంకతో జరిగిన టెస్టులో విజయం సాధించడంతో సిరిస్లో 1-0తో టీమిండియా ముందంజలో నిలిచింది.
గాలే టెస్టు విజయం తర్వాత 'పూల్లో ఉల్లాసంగా' అని కామెంట్ చేస్తూ ఓపెనర్ కేఎల్ రాహుల్తో కలసి ఉన్న ఫొటోను కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఇక గాలే టెస్టుతో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన పాండ్యా 'కోహ్లీ, రాహుల్తో సరదా సమయం' అంటూ ట్వీట్ చేశాడు.
మరోవైపు బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ.. జట్టు సభ్యులతో ఎంజాయ్ చేస్తున్న సెల్ఫీని సోషల్ మీడియాలో ఉంచాడు. ఈ ఫొటోలో వీడియో గేమ్తో ధావన్, మరికొందరు క్రికెటర్లు ఎంజాయ్ చేస్తున్నారు.