
ఈ విజయం వారిదే:
మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'మ్యాచ్ గెలిచినందుకు చాలా గర్వంగా ఉంది. ఇదో గొప్ప అనుభూతి. 136 పరుగులు పెద్ద లక్ష్యమేమీ కాదు. అయినా చివరి బంతి వరకు పోరాడాలని ముందే నిర్ణయించుకున్నాం. మా బౌలర్లు సరైన ప్రాంతాల్లో బంతులు వేసి మ్యాచ్ కాపాడారు. ఈ విజయం వారిదే' అని రోహిత్ తెలిపారు.

140 పరుగులు చేస్తే చాలు అనుకున్నాం:
'అల్జారి బాగా బౌలింగ్ చేసాడు. తొలి మ్యాచ్లోనే ఇంత గొప్ప ప్రదర్శన సాధారణమైన విషయం కాదు. జోసెఫ్ కరేబియన్ ప్రిమియర్ లీగ్లో బాగా రాణించాడు. అదే విశ్వాసంతో బౌలింగ్ చేశాడు. మేము బ్యాటింగ్ సరిగా ప్రారంభించలేదు. కొన్ని ఓవర్ల తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతుంటే.. 170-180 పరుగులు అసాధ్యమనిపించింది. నాణ్యమైన బౌలర్లు ఉన్నారు కాబట్టి.. 140 పరుగులు చేస్తే చాలు అనుకున్నాం' అని రోహిత్ పేర్కొన్నారు.

సీజన్ ఆరంభం చాలా ముఖ్యం:
సీజన్ మొదట్లోనే వీలయినన్ని మ్యాచులు గెలిస్తే.. చివరలో ఒత్తిడి ఉండదు, అందుకే మ్యాచులు గెలవడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రపంచ కప్ కోసం కొందరు ఆటగాళ్లు జట్టును వీడుతున్నారు, ఈ విషయంలో ఏమీ చేయలేం. సీజన్ ఆరంభం చాలా ముఖ్యమైనది. చివరి రెండు మ్యాచులు జట్టులోని ఆటగాళ్ల సత్తాను వెలికితీసింది. పొలార్డ్ అద్భుతంగా రాణించాడు. బౌలర్లు అందరూ కూడా తమ వంతు కృషి చేసారు' అని రోహిత్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












