శ్రీలంకను కోలుకొనివ్వకుండా..
తొలుత 37పరుగుల వరకు వికెట్ కోల్పోకుండా రెండో ఇన్నింగ్స్ ధాటిగా ప్రారంభించిన శ్రీలంక.. తర్వాత కెప్టెన్ దిముత్ కరుణరత్నే (23) ఔటవ్వడంతో కోలుకోలేకుండా పోయింది. నాథన్ లయాన్ బరిలోకి దిగడంతో రెగ్యులర్గా శ్రీలంక బ్యాటర్లు హిట్టింగ్ చేయాలని చూస్తూ ఔటయ్యారు. లయాన్ 11 ఓవర్లలో 31 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీయగా, లెగ్ స్పిన్నర్ మిచెల్ స్వెప్సన్ ఏడు ఓవర్లలో 34పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆఫ్ స్పిన్నర్ ట్రావిస్ హెడ్ 2.5 ఓవర్లలో 10 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
ఒకే ఒక్క ఛేంజ్..
ఈ మ్యాచ్ ముగిశాక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఒక్క ఛేంజ్ వచ్చింది. శ్రీలంక ఒక స్థానానికి పడిపోగా.. వెస్టిండీస్ ఒక్క స్థానం ఎగబాకి 5వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా (77.88 విన్నింగ్ పర్సంటేజీ)తో తొలి స్థానంలో ఉంది. ఇక దక్షిణాఫ్రికా (71.43 విన్నింగ్ పర్సంటేజీ)తో తన రెండో స్థానాన్ని కొనసాగిస్తుంది. రెండో టెస్ట్ కూడా గెలిస్తే ఆస్ట్రేలియా అగ్రస్థానానికి ఢోకా ఉండదు.
మూడో స్థానంలోనే ఇండియా
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021 - 23లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతుంది. భారత్ ప్రస్తుతం 77పాయింట్లతో 58.33విన్నింగ్ పర్సంటేజీతో కొనసాగుతుంది. ఇక 4వ స్థానంలో పాకిస్తాన్ (52.38), 5వ స్థానంలో వెస్టిండీస్ (50) ఉన్నాయి. ఇక టీమిండియా నేడు ఇంగ్లాండ్తో 5వ టెస్ట్ మ్యాచ్లో తలపడనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో ముందడుగు వేయాలంటే భారత్కు ఈ టెస్టులో గెలవడం తప్పనిసరి.
చివరి మూడు స్థానాల్లో ఆ జట్లు
ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్లు వరుసగా 7, 8, 9 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇంగ్లాండ్ జట్టు 15గేమ్లలో కేవలం నాలుగు విజయాలు మాత్రమే చేయగలిగింది. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో 3-0 తేడాతో ఇంగ్లాండ్ బలంగా పుంజుకుంది. కివీస్ తొమ్మిది మ్యాచ్లలో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే గెలిచి 8వ స్థానానికి పడిపోగా.. బంగ్లాదేశ్ 10 మ్యాచ్ల్లో ఒక విజయం మాత్రమే సాధించి అట్టడుగున కొనసాగుతుంది.