హైదరాబాద్: జింబాబ్వేతో జరిగిన రెండు టీ20ల సిరీస్ను ఆప్ఘనిస్థాన్ 2-0తో కైవసం చేసుకుంది. షార్జా వేదికగా మంగళవారం జరిగిన రెండో టీ20లో ఆ జట్టు 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి టీ20ని 5 వికెట్ల తేడాతో నెగ్గిన ఆప్ఘన్ జట్టు, ఇప్పుడు రెండో టీ20లో కూడా గెలిచి సిరిస్ను కైవసం చేసుకుంది.
Afghanistan do it again! They have won the T20I series 2-0, after their 17 run win over Zimbabwe in Sharjah. #AFGvZIM 🇦🇫 🇿🇼
— ICC (@ICC) February 6, 2018
Scorecard ➡️ https://t.co/qlQLLDIBcO pic.twitter.com/CFeaKkuBgk
మూడో ఓవర్లో ఓపెనర్ సోలోమన్ మిరే (2) పరుగుల వద్ద జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత సికిందర్ రజా (40), మసకద్జ (29), బుర్ల్ (30) పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో జింబాబ్వే
నిర్ణీత ఓవర్లలో 20 వికెట్లు కోల్పోయి 141 పరుగులే చేయగలిగింది.
ఆప్ఘనిస్థాన్ బౌలర్లలో ముజీబ్ రెహ్మాన్ (2/21), రషీద్ ఖాన్ (2/23) జింబాబ్వేని కట్టడి చేశారు. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల వన్డే సిరిస్ శుక్రవారం (ఫిబ్రవరి 9) నుంచి ప్రారంభం కానుంది.
@ACBofficials set a target of 159 runs for @ZimCricketv to chase in the alotted 20 overs in the 2nd T20I of #AziziBankCup #AFGvZIM pic.twitter.com/A4XWhrTn1l
— Afghan Cricket Board (@ACBofficials) February 6, 2018
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.