హైదరాబాద్: ఎత్తు కారణంగా ఓ క్రికెట్ అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. మూడు వన్డేల సిరిస్లో భాగంగా లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియం వేదికగా ఆప్ఘనిస్థాన్-వెస్టిండిస్ జట్ల మధ్య బుధవారం తొలి వన్డే ప్రారంభమైంది. ఈ వన్డేని చూసేందుకు వచ్చిన ఓ ఆప్ఘన్ అభిమానికి లక్నోలో చేదు అనుభవం ఎదురైంది.
ఆప్ఘనిస్థాన్ నుంచి వచ్చిన షేర్ఖాన్ అనే క్రికెట్ అభిమానికి లక్నోలో బస చేయడానికి హోటల్ గదులు దొరకడం లేదు. ఎందుకంటే అతడు 8 ఫీట్ల 2 ఇంచుల పొడవున్నాడు కాబట్టి. కాబుల్ నుంచి లక్నోకు చేరుకున్న షేర్ఖాన్ ఎత్తుకు సరిపడ హోటల్ గదులు లక్నోలో లేకపోవడంతో అతడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
తొలి టీ20 ఓటమి ఎఫెక్ట్: ఖలీల్ స్థానంలో శార్దుల్ ఠాకూర్?, మార్పులు తప్పవన్న రోహిత్
ఈ నేపథ్యంలో చేసేదేమీ లేక షేర్ ఖాన్ నాకా పోలీసు స్టేషన్కు వెళ్లి తన సమస్యను పోలీసులకు వివరించాడు. అనంతరం షేర్ఖాన్కు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను పరిశీలించిన పోలీసులు.. అతను బస చేయడానికి ఓ ప్రదేశాన్ని చూపించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అరుదైన మైలురాయి: రాజ్కోట్ టీ20తో ఎలైట్ జాబితాలోకి రోహిత్ శర్మ
కాగా, ఈ వన్డే సిరిస్లో ఆప్ఘనిస్థాన్ జట్టుకు రషీద్ ఖాన్ నాయకత్వం వహిస్తుండగా... వెస్టిండిస్ జట్టుకు కీరన్ పొలార్డ్ కెప్టెన్గా వ్యవహారిస్తున్నాడు. వన్డే సిరిస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ జరగనుంది. అనంతరం ఏకైక టెస్టు కూడా జరగనుంది. అన్ని మ్యాచ్లు ఈ స్టేడియంలోనే జరగడం విశేషం.