మా వంతు ట్రై చేశాం
నబీ మాట్లాడుతూ.. 'నిన్న రాత్రి మేం పాకిస్థాన్తో ఆడాము. చాలా టఫ్ మ్యాచ్ జరిగింది. ఆ వెంటనే ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా భారత్తో తలపడ్డాం. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్ రిజల్ట్ పట్ల మేం చాలా ఫీలయ్యాం. మేము భారత్తో మ్యాచ్కు మానసికంగా సిద్ధంగా లేం. మేము ఆ ఓటమిని మర్చిపోయి మేం రెడీ కావడానికి మా వంతు ప్రయత్నం చేశాం. కాని మా జట్టు ప్లేయర్లు కొందరు మానసికంగా కుంగిపోయారు. భారత్తో ఈరోజు జరిగిన మ్యాచ్లో మేము మా బెస్ట్ ఇచ్చామనే అనుకుంటున్నా. ఇక భారత్ నుంచి కేఎల్ రాహుల్, కోహ్లీ ఓపెనింగ్ బాగుంది. అలాగే మేము కొన్ని క్యాచ్లను కూడా మిస్ చేశాం. బ్యాటింగ్లో మేము ఇంత స్వింగ్ వస్తుందని ఊహించలేదు. మేము టోర్నమెంట్ను ప్రారంభించిన విధానం చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ ముగింపు మాత్రం బాలేదు. ఏదేమైనా మేం బానే ఆడామనుకుంటున్నా' అని నబీ అన్నాడు.
పాకిస్థాన్ చేతిలో ఓటమితో దెబ్బతిన్న ఆఫ్ఘన్
ఇక పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘన్ దాదాపు గెలిచినంత పనిచేసింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో పాక్ 10వ నంబర్ బ్యాటర్ నషీమ్ షా రెండు సిక్సులు కొట్టడంతో ఆఫ్ఘన్ ఓటమి పాలయింది. అంతకుముందు ఫరీద్, ఆసిఫ్కు గొడవ కావడంతో ఈ మ్యాచ్ తీవ్ర ఉద్విగ్నంగా సాగింది. అందువల్ల ఆఫ్ఘన్ ప్లేయర్లు, అభిమానులు కూడా ఈ మ్యాచ్ ఓటమితో చాలా ఫీలయ్యారు. ఇది కొంత ఆ జట్టును దెబ్బతీసిందని చెప్పొచ్చు.
రెండో బిగ్గెస్ట్ ఓటమి..
ఇకపోతే ఆఫ్ఘనిస్థాన్కు టీ20ల్లో ఈ ఓటమి రెండో భారీ ఓటమి. అంతకుముందు 2012లో కొలంబోలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 116పరుగుల భారీ తేడాతో ఓటమి మూటగట్టుకుంది. ఇక రెండో భారీ ఓటమిగా ఇండియాతో జరిగిన నిన్నటి మ్యాచ్లో 101పరుగుల తేడాతో ఓటమి. 2103లో ఐర్లాండ్తో 68పరుగుల తేడాతో, 2021లో ఇండియాతో 66పరుగుల తేడాతో ఆఫ్ఘన్ ఓటమి పాలయింది.