For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 లీగ్‌లో సంచలనం.. 15 సిక్సర్లతో 33 బంతుల్లోనే సెంచరీ, వైభవ్ సూర్యవంశీ రికార్డు బ్రేక్!

Madhya Pradesh League 2025: ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇది టీ20 లీగ్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ. మధ్యప్రదేశ్ లీగ్‌లో అభిషేక్ పాఠక్ వైభవ్ సూర్యవంశీ కంటే వేగంగా సెంచరీ కొట్టాడు. అభిషేక్ పాఠక్ కేవలం 33 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేశాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో అభిషేక్ పాఠక్ కేవలం సిక్సర్ల ద్వారానే 90 పరుగులు పూర్తి చేశాడు. అభిషేక్ పాఠక్ భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు వీరాభిమాని కూడా కావడం గమనార్హం. మ్యాచ్ తర్వాత సూర్య కుమార్ యాదవ్ నుంచి తాను ఏమి నేర్చుకోవాలనుకుంటున్నాడో చెప్పాడు.

శనివారం బుందేల్‌ఖండ్ బుల్స్, జబల్పూర్ రాయల్ లయన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ముందుగా బుందేల్‌ఖండ్ బుల్స్ జట్టు బ్యాటింగ్ చేసింది. బుందేల్‌ఖండ్ బుల్స్ జట్టులో భాగమైన అభిషేక్ పాఠక్, కరణ్ తహిలియానితో కలిసి మొదటి వికెట్‌కు 178 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. అభిషేక్ పాఠక్ 13 ఓవర్ల తర్వాత ఔటయ్యాడు కానీ అంతకు ముందు అభిషేక్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.

Abhishek Pathak Breaks Record Smashes 33-Ball Century with 15 Sixes in Madhya Pradesh T20 League

33 బంతుల్లో సెంచరీ
అభిషేక్ పాఠక్ 33 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. అభిషేక్ సెంచరీ తర్వాత కూడా తన విధ్వంసకర ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. అభిషేక్ పాఠక్ 48 బంతుల్లో 133 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 15 సిక్సర్లు, 7 ఫోర్లు కొట్టాడు. అంటే అభిషేక్ సిక్సర్ల ద్వారా మాత్రమే 90 పరుగులు చేశాడు. రెండవ ఓవర్లో 3 సిక్సర్లు కొట్టిన తర్వాత.. నాలుగో ఓవర్లో రితేష్ శాక్య బౌలింగ్‌లో అభిషేక్ వరుసగా 4 సిక్సర్లు కొట్టాడు. జబల్పూర్ రాయల్ లయన్స్ తరపున రితేష్ అత్యధిక పరుగులు సమర్పించుకున్నాడు. రితేష్ తన 4 ఓవర్ స్పెల్‌లో 53 పరుగులు ఇచ్చాడు. అనుభవ్ అగర్వాల్ 3 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చాడు.

సూర్యకుమార్ యాదవ్ లాగా ఉండాలనుకుంటున్న అభిషేక్ పాఠక్
మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడుతూ.. "నేను 13 ఏళ్ల వయస్సులో క్రికెట్ ఆడటం ప్రారంభించాను. నేను అండర్ 16, అండర్ 19, అండర్ 23లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాను. నేను సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఆడాను. ఈ ప్రయాణం చాలా బాగుంది. గత సంవత్సరం కూడా నేను మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లో బాగా రాణించాను. నేను త్వరలో ఐపీఎల్‌ లో ఆడగలనని నేను అనుకోను. నాకు ఎక్కడ ఆడటానికి అవకాశం దొరికినా నేను బాగా ఆడడం, ఎక్కువ పరుగులు చేయడం గురించి మాత్రమే ఆలోచిస్తాను. సూర్యకుమార్ యాదవ్ లాగా స్థిరత్వం నేర్చుకోవాలనుకుంటున్నాను." అని అభిషేక్ పాఠక్ పేర్కొన్నాడు.

సోమవారం సెమీఫైనల్
ముందుగా బ్యాటింగ్ చేసిన బుందేల్‌ఖండ్ బుల్స్ 246 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా జబల్పూర్ రాయల్ లయన్స్ జట్టు 227 పరుగులకే కుప్పకూలింది. బుందేల్‌ఖండ్ ఈ మ్యాచ్‌ను 19 పరుగుల తేడాతో గెలుచుకుంది. ఆదివారం లీగ్ దశలో 2 చివరి మ్యాచ్‌లు ఉన్నాయి. రేపు అనగా జూన్ 23న మధ్యప్రదేశ్ లీగ్‌లో మొదటి, రెండో సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. టైటిల్ మ్యాచ్ జూన్ 24న జరగనుంది. అన్ని మ్యాచ్‌లు గ్వాలియర్‌లోని శ్రీమంత్ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి.

Story first published: Sunday, June 22, 2025, 11:19 [IST]
Other articles published on Jun 22, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+