IPL and PSL: ఐపీఎల్లో శనివారం రాత్రి జైపూర్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ జైపూర్ నుంచి 886 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావల్పిండిలో జరిగింది. ఇందులో పెషావర్ జల్మీ, ముల్తాన్ సుల్తాన్స్ జట్లు ఆడాయి. లక్నో తరపున అబ్దుల్ సమద్ చివరి ఓవర్లో విధ్వంసం సృష్టించాడు. ఇదిలా ఉండగా పీఎస్ఎల్ 2025లో పెషావర్ జల్మీ తరఫున కూడా అబ్దుల్ సమద్ బ్యాట్ నుంచి కూడా పేలుడు ఇన్నింగ్స్ వచ్చింది.
ఐపీఎల్లో నాలుగు సిక్సర్లు కొట్టిన అబ్దుల్ సమద్
ఐపీఎల్లో 19 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఆ సమయంలో జట్టు 165 పరుగులకు చేరుకోవడం కూడా కష్టంగా అనిపించింది. కానీ అబ్దుల్ సమద్ చివరి ఓవర్లో నాలుగు సిక్సర్లు కొట్టాడు. సందీప్ శర్మ వేసిన ఈ ఓవర్లో మొత్తం 27 పరుగులు వచ్చాయి. దీంతో లక్నో స్కోరు 180 పరుగులకు చేరుకుంది. అద్బుల్ సమద్ 10 బంతుల్లో 300 స్ట్రైక్ రేట్తో 30 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో అబ్దుల్ సమద్ 5 బంతుల్లో 26 పరుగులు చేశాడు.

పాకిస్థాన్ సూపర్ లీగ్లో కూడా అబ్దుల్ సమదే..
పెషావర్ జల్మీకి చెందిన అబ్దుల్ సమద్ కూడా పాకిస్థాన్ తరపున 5 టీ20 మ్యాచ్లు ఆడాడు. ముల్తాన్ సుల్తాన్స్పై పెషావర్ జల్మీ జట్టు తరపున అబ్దుల్ సమద్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. పెషావర్ తరఫున అబ్దుల్ సమద్ 14 బంతుల్లో 286 స్ట్రైక్ రేట్తో 40 పరుగులు చేశాడు. అబ్దుల్ సమద్ 4 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. ఆకిబ్ జావేద్ వేసిన 18వ ఓవర్లో అబ్దుల్ సమద్ రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు. ఈ ఓవర్లో పెషావర్ బ్యాటర్లు 24 పరుగులు చేశారు. ఈ ఓవర్లోనే అబ్దుల్ సమద్ 5 బంతుల్లో 22 పరుగులు చేశాడు. నసీమ్ షా సోదరుడు ఒబైద్ షా వేసిన 17వ ఓవర్లో అద్బుల్ సమద్ ఒక సిక్స్ రెండు ఫోర్లు కొట్టాడు.
రెండు మ్యాచ్లలోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అబ్దుల్ సమద్లే..
రాజస్థాన్ రాయల్స్పై లక్నో సూపర్ జెయింట్స్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా పెషావర్ జల్మీ ముల్తాన్ సుల్తాన్స్పై 120 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. రెండు మ్యాచ్లలో అబ్దుల్ సమద్లే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో 27 ఏళ్ల పాకిస్తానీ అబ్దుల్ సమద్ ఆడుతున్న మొదటి మ్యాచ్ అది. గత నెలలో న్యూజిలాండ్ పర్యటనలో అబ్దుల్ సమద్ తన టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.