హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత్ దక్షిణాఫ్రికా జట్టుతో తలపడుతున్న సంగతి తెలిసిందే. అయితే రెండో టెస్టులో భాగంగా మంగళవారం దక్షిణాఫ్రికా బౌలర్లు సెంచూరియో వేదికగా రెచ్చిపోయి ఆడుతున్నారు. మ్యాచ్ ఆరంభానికి ముందు గట్టి పట్టుదలతో కనిపించిన బుమ్రాను డివిలియర్స్ గురించి అడగగా ఈ విధంగా బదులిచ్చాడు.
'రెండో టెస్టులో ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. వీలైనంత త్వరగా ఎవరు వికెట్లు తీస్తే వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. నాలుగో రోజు మంగళవారం ఆటలో దక్షిణఫ్రికా ఆటగాళ్లను త్వరగా పెవిలియన్కు పంపించాలి. వారిపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రస్తుతం ఇదే మా ప్లాన్' అని బుమ్రా పేర్కొన్నాడు.
మూడో రోజు దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 8ఓవర్లు వేసిన బుమ్రా రెండు వికెట్లను దక్కించుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డివిలియర్స్ ఔటయ్యాడు.
డివిలియర్స్కు బంతులేయడం గురించి బుమ్రా మాట్లాడుతూ..'అతడు ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మెన్ అని ఇప్పటికే నిరూపించుకున్నాడు. అతనికి బౌలింగ్ చేయటం సవాల్తో కూడుకున్నది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అతనికి బంతులేయడం ఓ పాఠమే. ఈ పాఠం ద్వారా చాలా నేర్చుకోవచ్చు. డివిలియర్స్కు బంతులేస్తే నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఈ సిరీస్ ద్వారా నాకు చాలా మంచి అవకాశం దొరికింది' అని బుమ్రా తెలిపాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.