భారత మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ కూడా క్రికెట్ లో రాణిస్తున్నాడు. సమిత్ ద్రవిడ్ కొట్టిన సిక్స్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమిత్ ద్రవిడ్ ప్రస్తుతం మహారాజా ట్రోఫీ KSCA T20 టోర్నమెంట్లో మైసూర్ వారియర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శుక్రవారం బెంగళూరు బ్లాస్టర్స్తో జరిగిన మ్యాచ్లో సమిత్ ద్రావిడ్ కేవలం 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే అతను కొట్టిన ఒక అద్భుతమైన సిక్సర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ మ్యాచ్ లో మైసూర్ వారియర్స్ ఓటమి పాలయింది. జట్టు 182 పరుగుల స్కోరును కాపాడుకోలేకపోయింది. చివరికి వర్షం ఆటంకంతో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. గత నెలలో జరిగిన మహారాజా ట్రోఫీ వేలంలో సమిత్ ద్రవిడ్ను మైసూర్ వారియర్స్ రూ.50,000 ధరకు కొనుగోలు చేసింది. అంతకు ముందు సమిత్ ద్రవిడ్ కర్ణాటక U-19 జట్టులో కూడా ఆడాడు. కూచ్ బెహార్ ట్రోఫీలో కర్ణాటక టైటిల్ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

మహారాజా ట్రోఫీ కేఎస్సీఏలో భాగంగా మైసూర్ వారియర్స్, గుల్బర్గా మిస్టిక్స్ జట్లు తలపడ్డాయి. మొదటి బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ 18.3 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. వారియర్స్ కెప్టెన్ కరుణ్ నాయర్ మెరుపు అర్ద సెంచరీతో 66 పరుగులు చేయగా.. సమిత్ ద్రవిడ్ 24 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ తో 24 పరుగులు చేశాడు. జగదీశ్ సుచిత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 12 బంతుల్లో 2 ఫోర్లు, నాలుగు సిక్స్ లతో 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.