
ఆస్ట్రేలియా జట్టులో ఇద్దరు స్పిన్నర్లు
ప్రస్తుతం భారత పర్యటనకు ఎంపిక చేసిన ఆస్ట్రేలియా జట్టులో ఆస్టన్ ఆగర్, ఆడమ్ జంపా రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. ఆట కొనసాగే కొద్దీ బంతి ఎక్కువ నునుపు అవుతుందని కమిన్స్ తెలిపాడు. ఫలింతగా ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో బౌలింగ్ చేయడం అత్యంత సులభమని అన్నాడు.

బంతి ఎక్కువ నునుపు
"ఆటసాగే కొద్దీ కొత్త బంతి ఎక్కువ నునుపు అవుతుంది. అందుకే ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ సులభంగా బౌలింగ్ చేయొచ్చు. ఆస్ట్రేలియాతో పోలిస్తే ఉపఖండం మైదానాలు చిన్నవి, వేగవంతమైనవి. కాబట్టి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. బంతితో ఎక్కువ వేగం, బౌన్స్ రాబట్టడం కాస్త కష్టం" అని కమిన్స్ అన్నాడు.

జనవరి 14న ముంబైలో తొలి వన్డే
మూడు వన్డేల సిరిస్లో భాగంగా జనవరి 14న ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా జరిగే తొలి వన్డేతో ఈ సిరిస్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 17న రాజ్కోట్, 19న బెంగళూరు వేదికగా మిగతా మ్యాచ్లు జరగనున్నాయి. గతేడాది భారత్లో జరిగిన ఐదు వన్డే సిరీస్ను 3-2తో ఆసీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications
