హైదరాబాద్: ఇంగ్లాండ్తో ప్రారంభమైన డే-నైట్ టెస్టు మ్యాచ్లో మ్యాచ్ మొత్తం జో రూట్ చేతిలోనే ఉందా అన్నట్లు సాగింది. ఈ మ్యాచ్తో న్యూజిలాండ్ సంచలన విజయం నమోదు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్.. ఇంగ్లాండ్ టీమ్ను అత్యల్ప స్కోరుకే కుప్పకూల్చింది. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి ఇంగ్లీషు బ్యాట్స్మెన్ వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు.
ట్రెంట్ బోల్ట్, టిమ్ సౌతి.. ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. పదునైన బంతులతో వీరిద్దరూ చెలరేగడంతో 20.4 ఓవర్లలో 58 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌటైంది. ఇంగ్లండ్కు ఇది ఓవరాల్గా ఆరో అతిస్వల్ప స్కోరు కావడం గమనార్హం. ఐదుగురు బ్యాట్స్మెన్ పరుగులేమీ చేయకుండానే అవుటయ్యారు.
జో రూట్, బెయిర్స్టో, స్టోక్స్, మహ్మద్ అలీ, స్టువర్ట్ బ్రాడ్ డకౌటయ్యారు. ఓవర్టన్ (33), స్టోన్మన్(11) టాప్ స్కోరర్లుగా నిలిచారు. బోల్ట్ 32 పరుగులిచ్చి 6 వికెట్లు నేలకూల్చాడు. సౌతి 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరూ మూడేసి మేడిన్ ఓవర్లు వేయడం విశేషం.
దీంతో లంచ్ విరామానికి న్యూజిలాండ్ జట్టు ఒక వికెట్ నష్టానికి ముప్పై పరుగుల ఆధిక్యంతో 88 పరుగులు చేసింది. క్రీజులో టామ్ లాతమ్(26), కేన్ విలియమ్సన్(59) ఉన్నారు. విలియమ్సన్ 9 ఫోర్లు, 1 సిక్సు కొట్టి బంతిని బౌండరీకి పంపాడు.