
2013 ఛాంపియన్స్ ట్రోఫీ
ఇంగ్లండ్లో జరిగిన 2013 ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ గెలిచింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తుది పోరులో భారత్, ఇంగ్లండ్ పోటీపడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్ను 20 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ధోనీసేన 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (43), రవీంద్ర జడేజా (33) రాణించడంతో భారత్ మెరుగైన స్కోరు చేసింది.
130 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 8 వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులు చేసి ఓడిపోయింది. ఇయాన్ మోర్గాన్ (33), రవి బొపారా (30) మంచి భాగస్వామ్యం నెలకొల్పినా.. తమ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. చివరకు 5 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

2014 టీ20 ప్రపంచకప్
2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్తో తలపడిన శ్రీలంక విజేతగా నిలిచింది. ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన టీమ్భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ జిడ్డు ఇన్నింగ్స్ ఆడాడు. 21 బంతుల్లో కేవలం 11 పరుగులు చేశాడు. దీంతో భారత్ రన్రేట్ దారుణంగా పడిపోయింది. విరాట్ కోహ్లీ 77 పరుగులు తీసినప్పటికీ భారత్ కేవలం 130 పరుగులే చేయగలిగింది. అనంతరం బరిలోకి దిగిన లంక 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

2015 వన్డే ప్రపంచకప్
2015 వన్డే ప్రపంచకప్ టోర్నీని ఆస్ట్రేలియా గెలిచింది. మెల్బోర్న్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 45 ఓవర్లలో 183 రన్స్ చేసింది. గ్రాంట్ ఇల్లియట్ (83), రాస్ టేలర్ (40) రాణించారు. ఆపై కెప్టెన్ మైఖెల్ క్లార్క్ (74), స్టీవ్ స్మిత్ (56), డేవిడ్ వార్నర్ (45) రాణించడంతో 33.1 ఓవర్లలో ఆసీస్ గెలుపొందింది. 1987, 1999, 2003, 2007 సంవత్సరాలలో నిర్వహించిన వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.
WTC Final 2021:టీమిండియాను ఓడించినంత మాత్రాన.. భారత అభిమానులకు మేం చెడ్డవాళ్లమైపోము!!

2016 టీ20 ప్రపంచకప్
భారత్లో జరిగిన 2016 టీ20 ప్రపంచకప్ టోర్నీ తుది పోరులో ఇంగ్లండ్-వెస్టిండీస్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. జో రూట్ (54), జొస్ బట్లర్ (36), డేవిడ్ విల్లీ (21) ఫర్వాలేదనిపించాడు.విండీస్ బౌలర్లలో బ్రావో, బ్రాత్వైట్ తలో మూడు వికెట్లు తీశారు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్ జట్టు మరో రెండు బంతులు ఉండగానే గెలిచింది.
12 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన సమయంలో క్రిస్ జోర్డాన్ వేసిన 19వ ఓవర్లో శాముల్స్, బ్రాత్వైట్లు తడబడ్డారు. దీంతో చివరి ఓవర్లో విండీస్ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. స్టోక్స్ వేసిన చివరో ఓవర్లో వరుసగా నాలుగు బంతులను భారీ సిక్సర్లుగా మలచి విండీస్కు విజయాన్ని అందించాడు.

2017 ఛాంపియన్స్ ట్రోఫీ
2017 ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ కప్ కోసం తలపడ్డాయి. అయితే అన్ని మ్యాచ్ల్లో నిలకడగా ఆడిన కోహ్లీసేన.. ఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది. దీంతో పాక్ 180 పరుగుల భారీ తేడాతో గెలిచి విజేతగా నిలిచింది. 2019 వన్డే ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో న్యూజిలాండ్తో ఇంగ్లండ్ తలపడింది. మ్యాచ్, సూపర్ ఓవర్ కూడా టై అవ్వడంతో బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లీష్ జట్టు విజేతగా నిలిచింది. ఇక ఐసీసీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తొలిసారి నిర్వహించిన టెస్టు ఛాంపియన్షిప్ 2021 టోర్నీలో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది.


Click it and Unblock the Notifications












