
సఫారీ గడ్డపై ఒక్క ద్వైపాక్షిక సిరిస్ను గెలవని భారత్
గడచిన 25 ఏళ్లలో సఫారీ గడ్డపై భారత జట్టు ఒక్క ద్వైపాక్షిక సిరిస్ను కూడా గెలవలేదు. అయితే, ఇప్పుడు ఈ సువర్ణావకాశం కోహ్లీసేనకు దక్కింది. ఆరు వన్డేల సిరిస్లో ఇంకా రెండు వన్డేలు మిగిలున్నాయి. ఈ రెండు వన్డేల్లో ఏ ఒక్క వన్డేలో అయినా భారత జట్టు విజయం సాధిస్తే సపారీ గడ్డపై కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుంది. ఇక, ఐదో వన్డేలో విరాట్ కోహ్లీ వ్యక్తిగతంగా కూడా ఓ అరుదైన మైలురాయిని సొంతం చేసుకుంటాడు.

6 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ మరో రికార్డు
ఐదో వన్డేలో కోహ్లీ గనుక 6 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా జట్టుపై వన్డేల్లో 1109 పరుగులు చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ రికార్డుని అధిగమిస్తాడు. అంతేకాదు నాలుగో వన్డేలో 83 బంతుల్లో 75 పరుగులు చేసిన కోహ్లీ భారత్ తరఫున అత్యధిక వన్డే పరుగులు సాధించిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఈ జాబితాలో సచిన్(18,426), గంగూలీ(11,363), ద్రవిడ్(10,889), ధోని(9,954) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.

అత్యధిక పరుగుల జాబితాలో కోహ్లీ 16వ స్థానం
దీంతోపాటు దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ని కూడా కోహ్లీ అధిగమించే అవకాశం లభించింది. నాలుగో వన్డేలో కోహ్లీ 75 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం 206 వన్డేల్లో కోహ్లీ చేసిన పరుగులు 9,423కు చేరాయి. ఈ పరుగులతో ప్రపంచ క్రికెట్లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ 16వ స్థానంలో ఉన్నాడు. మరో 118 పరుగులు చేస్తే డివిలియర్స్ను కూడా అధిగమిస్తాడు.

అరుదైన రికార్డుకి చేరువలో చాహల్, కుల్దీప్
ఐదో వన్డేలో భారత మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్లు కూడా ఓ అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నారు. 2011లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరిస్లో సఫారీ బౌలర్ లోన్వోబో సోత్సోబే తీసిన 13 వికెట్లు తీశాడు. దీంతో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఓ సిరిస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రికార్డు అతడి పేరు మీదే ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న సిరిస్లో కుల్దీప్, జాహల్లు చెరో 12 వికెట్లు పడగొట్టారు. మరో రెండు వికెట్లు తీస్తే ఆ రికార్డు బద్దలవుతుంది.


Click it and Unblock the Notifications












