
నేను ఎంతో నేర్చుకున్నాను: సచిన్
'ముంబై రంజీ జట్టు ఎంతో మంది అత్యుత్తమ ఆటగాళ్లను అందించింది. ఇక్కడే నేను ఎంతో నేర్చుకున్నాను. మేమందరం ముంబయి తరఫున రంజీల్లో ఆడటం ద్వారా ఎంతో నేర్చుకున్నాం. సింహం బొమ్మ ఉన్న జెర్సీని ధరించడాన్ని ప్రతీ ముంబై క్రికెటర్ గర్వంగా భావిస్తాడు. పాత విజయాలు చూసుకొని సంబరపడిపోకుండా మళ్లీ అంతే పట్టుదలతో ఆడటం వల్లే ముంబై వరుసగా విజయాలు సాధిస్తోంది' అని సచిన్ అన్నాడు.

ఎన్నడూ ఓటమిని అంగీకరించని తత్వం జట్టు సొంతం
మరో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ 'ముంబై క్రికెట్లో గట్టి పోటీ ఉండటమే ఆ జట్టు బలం. ఎన్నడూ ఓటమిని అంగీకరించని తత్వం జట్టు సొంతం. విఫలమైతే మరో అవకాశం దక్కడం చాలా కష్టం కాబట్టి ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారు' అని అన్నాడు. తాజా మ్యాచ్ నేపథ్యంలో ముంబై రంజీ జట్టుకు సంబంధించిన కొన్ని విశేషాలు మీ కోసం...

ముంబై జట్టు తరుపున సత్తా చాటిన ఆటగాళ్లు
అత్యధిక పరుగులు: వసీం జాఫర్ (9759),
అత్యధిక వికెట్లు: పద్మాకర్ శివాల్కర్ (361),
అత్యుత్తమ బౌలింగ్: అంకిత్ చవాన్ (9/23),
సీజన్లో అత్యధిక పరుగులు: శ్రేయస్ అయ్యర్ (1321),
అత్యధిక స్కోరు: 855/6 డిక్లేర్డ్ (హైదరాబాద్పై).

టాప్-5 వ్యక్తిగత స్కోర్లు:
సంజయ్ మంజ్రేకర్ (377), విజయ్ మర్చంట్ (359 నాటౌట్), సునీల్ గావస్కర్ (340), అజిత్ వాడేకర్ (323), వసీం జాఫర్ (314 నాటౌట్).
ఇతర దేశవాళీ జట్ల అత్యధిక టైటిల్స్: న్యూసౌత్వేల్స్ (ఆస్టేలియా-షెఫీల్డ్ షీల్డ్) 46; యార్క్షైర్ (ఇంగ్లండ్- 34); హైవెల్డ్ లయన్స్ (దక్షిణాఫ్రికా-29); ఆక్లాండ్ ఏసెస్, (న్యూజిలాండ్ -23).

తొలి రంజీ ట్రోఫీని గెలిచిన ముంబై
1934-35లో జరిగిన తొలి రంజీ ట్రోఫీని ముంబై (అప్పటి బాంబే) గెలుచుకుంది. మొత్తం 83 సార్లు రంజీ ట్రోఫీ జరిగితే 41 టైటిల్స్ సాధించిన ముంబై మొత్తంగా 46 సార్లు ఫైనల్ చేరింది. కేవలం 5 ఫైనల్స్లో మాత్రమే ఆ జట్టు ఓటమి పాలైంది. 1958-59 సీజన్ నుంచి 1972-73 సీజన్ వరకు ముంబై వరుసగా 15 సార్లు విజేతగా నిలిచింది. ఎనిమిది సార్లు రంజీ విజేతగా నిలిచిన జట్లలో వసీం జాఫర్ సభ్యుడిగా ఉన్నాడు. ముంబై 100, 200, 300, 400వ రంజీ మ్యాచ్లలో విజయాలు అందుకుంది.


Click it and Unblock the Notifications











