న్యూఢిల్లీ: ఢిల్లీ క్రికెటర్ హర్ష త్యాగి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ స్కూల్ కప్ టీ20 టోర్నీలో భాగంగా నోయిడాలోని సెక్టార్-34 గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో ఈ ఘనతను సాధించాడు. బిల్లాబోంగ్ ఇంటరేషనల్ హైస్కూల్, గురుకుల్ స్కూల్ జట్ల మధ్య నవంబర్ 25న జరిగిన మ్యాచ్లో 2.3 ఓవర్లు వేసిన త్యాగి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 5 వికెట్లు తీశాడు.
ఢిల్లీ క్రికెట్లో హర్ష త్యాగి పేరు వినిపించడం ఇదే తొలిసారి కాదు. ఢిల్లీ రాష్ట్రం తరుపున అండర్-19 జట్టుకి కూడా త్యాగి ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం ఢిల్లీ అండర్-23 జట్టు తరుపున ఆడుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లాడిన త్యాగి 17 వికెట్లు తీసుకున్నాడు. త్యాగి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు.

కాగా ఈ టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బిల్లాబోర్డ్ నిర్ణీత 20 ఓవర్లకు గాను 261 పరుగులు సాధించింది. ఆ తర్వాత 262 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించడంలో గురుకుల్ జట్టు విఫలమైంది. త్యాగి అద్భుతమైన బౌలింగ్తో గురుకుల్ జట్టు 46 పరుగులకే ఆలౌటైంది.
2.3 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా త్యాగి 5 వికెట్లు తీసుకున్నాడు. గురుకుల్ జట్టులో 8వ స్ధానంలో బ్యాటింగ్కు దిగిన బ్యాట్స్మెన్ చేసిన 13 పరుగులే అత్యధిక పరుగులు కావడం విశేషం. ఈ టోర్నీ నిర్వాహకులు సైతం త్యాగి బౌలింగ్ రికార్డుకి ముగ్ధులయ్యారు.