IPL 2025 Injured Players : మరో 9 రోజుల్లో ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. మార్చి 22నుంచి షురూ కానున్న ఈ మెగా లీగ్ లో.. టైటిల్ సాధించడమే లక్ష్యంగా ఈ సారి కూడా 10 జట్లు పోటీ పడుతున్నాయి. తొలి మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. అయితే న్యూస్ 18 కథనం ప్రకారం.. ఈ సీజన్ లో పలువురు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా తప్పుకుంటున్నారని తెలిసింది. మరి కొంతమంది ఆడతారా లేదా అనేది అనుమానంగా మారింది. ఇంతకీ వారెవరంటే?
మయాంక్ యాదవ్
లఖ్నవూ సూపర్ జెయింట్స్.. పేసర్ మయాంక్ యాదవ్ను రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుంది. దిల్లీకి చెందిన ఈ ఫాస్ట్ బౌలర్.. ఐపీఎల్ 2025 ఫస్ట్ హాఫ్ సీజన్ కు అందుబాటులో ఉండడని తెలిసింది. ప్రస్తుతం అతడు నడుము గాయం నుంచి కోలుకుంటున్నాడని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడని సమాచారం అందింది.
