
చుక్కలు చూపిన అశ్విన్, సాహా
వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో మంగళవారం ప్రారంభమైన మూడో టెస్ట్లో తొలిసారి భారత బ్యాట్స్మెన్ తడబడ్డా.. బౌలర్ అశ్విన్, కీపర్ సాహా రాణించడంతో విండీస్కు కష్టాలు తప్పేట్టులేవు.

చుక్కలు చూపిన అశ్విన్, సాహా
డారెన్ సామి స్టేడియంలో మంగళవారం మొదలైన మూడో టెస్టులో తొలి రోజు టీ విరామ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 52 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.

చుక్కలు చూపిన అశ్విన్, సాహా
ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ (190 బంతుల్లో 75 నాటౌట్ ; 4 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (122 బంతుల్లో 46 నాటౌట్ ; 4 ఫోర్లు) నిలకడ బ్యాటింగ్ తీరుతో 90 ఓవర్లలో ఆట ముగిసే సమయానికి 234/5తో కోలుకుంది.

చుక్కలు చూపిన అశ్విన్, సాహా
200 పరుగుల లోపే ఆలౌటవుతుందనుకున్న టీమిండియాను అశ్విన్, సాహా వికెట్లు కోల్పోకుండా ఉండేందుకు ప్రాధాన్యమిస్తూ పట్టుదలతో క్రీజులో నిలిచి, చివరికి తొలిరోజు భారత్ కు మంచి భాగస్వామ్యం అందించారు.

చుక్కలు చూపిన అశ్విన్, సాహా
మొదట టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత బ్యాట్స్ మన్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఓపెనర్ లోకేశ్ రాహుల్ 65 బంతుల్లో 50(6ఫోర్లు) మినహా మిగిలిన బ్యాట్స్మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు. రహానే 133 బంతుల్లో 35(4 ఫోర్లు) సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచినా పెద్దగా పరుగులు చేయలేదు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (1), కోహ్లీ (3), రోహిత్ శర్మ (9) విఫలమయ్యారు.


Click it and Unblock the Notifications











