సిడ్నీ: మూడు మ్యాచుల టీ20 సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో గెలుపొందిన భారత్.. ఆదివారం జరిగిన మూడో మ్యాచులోనూ ఆసీస్ను ఓడించి సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. వన్డే సిరీస్ కోల్పోయినప్పటికీ టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి భారత్ ప్రతీకారంతీర్చుకుంది. రోహిత్, కోహ్లీ, రైనా, యూవీలు రాణించడంతో చివరి టీ20 మ్యాచులోనూ భారత్ విజయం సాధించింది.
సిడ్నీ మైదానంలో ఆదివారం జరిగిన మూడో టీ20 మ్యాచులో ఆసీస్ విధించిన 198 పరుగల లక్ష్యఛేదనలో భారత్ కూడా ధాటిగానే ఆరంభించింది. అయితే 9బంతుల్లో 26 పరుగులు చేసిన ధావన్.. వాట్సన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అనంతరం బైసీ బైలింగ్ లో రోహిత్ 52(5 ఫోర్లు, ఒక సిక్స్) పరుగుల వద్ద ఔటయ్యాడు.

50 పరుగులు చేసిన తర్వాత కోహ్లీ కూడా బైసీ బౌలింగ్ లోనే ఔటయ్యాడు. కాగా, రైనా 39 బంతుల్లో 49(6ఫోర్లు, ఒక సిక్స్), యువరాజ్ సింగ్ 12 బంతుల్లో 15(ఒక ఫోర్, ఒక సిక్స్)పరుగులతో అజేయంగా నిలిచి భారత్ కు విజయాన్నందించారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ధాటిగా ఆడింది. తొలుత వికెట్లు కోల్పోయినప్పటికీ పరుగుల రాబట్టడంలో ఏమాత్రం తగ్గలేదు. 14 పరుగులు చేసిన ఓపెనర్ ఖవాజా... నెహ్రా బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ తర్వాత 9 పరుగులు చేసిన మార్ష్.. అశ్విన్ బౌలింగ్లో వెనుదిరిగాడు.
మాక్స్వెల్ కూడా 3 పరుగులకే యువరాజ్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 26 పరుగులు చేసి టిఎం హెడ్ వెనుదిరిగాడు. ఆ తర్వాత లిన్ 13పరుగులు చేసి ఔటయ్యాడు. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. వాట్సన్ 86 బంతుల్లో 124(10ఫోర్లు, 6సిక్స్ లు) పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

కాగా, భారత బౌలర్లలో నెహ్రా, బుమ్రా, అశ్విన్, జడేజా, యువరాజ్ తలో వికెట్ తీశారు.
