హైదరాబాద్: హారారే వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో జింబాబ్వే బ్యాట్స్మెన్ అద్భుత ప్రదర్శన చేశారు. నాలుగో రోజు ఆటలో భాగంగా 140 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినప్పటికీ, చివరిరోజైన గురువారం విండిస్ బౌలర్లకు ధీటుగా ఎదుర్కొని క్రీజులో నిలిచారు.
దీంతో 12 ఏళ్ల అనంతరం జింబాబ్వే ఓ టెస్టు మ్యాచ్ని డ్రా చేసుకుంది. జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజా (89)తో పాటు ఎనిమిదో స్ధానంలో బరిలోకి దిగిన చక బ్వా (71 నాటౌట్ల్) అద్భుత పోరాటంతో
రెండో ఇన్నింగ్స్లో 144 ఓవర్లలో ఏడు వికెట్లకు 301 పరుగులు చేసింది.

ముఖ్యంగా చివర్లో చకబ్వా, క్రీమర్ (28 నాటౌట్) విండీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించి అజేయంగా 49 పరుగులు జోడించారు. దీంతో రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ను వెండీస్ 1-0తో సిరీస్ను నెగ్గింది.