కోల్కతా: ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న రెండో టెస్టులో గౌతమ్ గంభీర్కు అవకాశమివ్వకుండా శిఖర్ ధావన్ను తీసుకోవడంపై టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు అతని తీరుపై మండిపడుతున్నారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ తొలి పరుగు వద్దే ఓపెనర్ శిఖర్ ధావన్ (1) వికెట్ కోల్పోయింది. జట్టులోకి పునరాగమనం చేసిన గంభీర్కి ఈ టెస్టులో చోటు దక్కకపోగా, గాయపడిన రాహుల్ స్థానంలో ధావన్కి కోహ్లి అవకాశమిచ్చాడు.

దీంతో నెటిజన్లు కోహ్లీని టార్గెట్ చేశారు. గంభీర్ను కాదని ధావన్ని తీసుకోవడం.. హనీమూన్కు స్విట్జర్లాండుకు కాకుండా బంగ్లాదేశ్కు వెళ్లడమని ఒకరు, టీంలోకి తీసుకొని, రెండో టెస్టు ఆడే అవకాశమివ్వకుండా విరాట్ కోహ్లీ... గౌతమ్ గంభీర్ పైన సర్జికల్ స్ట్రయిక్ నిర్వహించారని మరొకరు ట్వీట్ చేశారు. చాలామంది చాలా ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు.