
తెలుపు రంగు జాకెట్ ఉండటం గౌరవానికి చిహ్నం
‘నా వార్డ్రోబ్లో తెలుపు రంగు జాకెట్ ఉండటం గౌరవానికి చిహ్నం. దానిని ధరించే అవకాశం వస్తుందనుకోలేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు (2013లో) టీమిండియా కఠిన పరిస్థితుల్లో ఉంది. టోర్నీలో మేమెలా ఆడతామో? అని అందరూ సందేహించారు' అని ధోని ఈ సందర్భంగా అన్నాడు.

జోకర్లలా కనిపించాం
అయితే ఈసారి కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఛాంపియన్స్ ఆడుతోంది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఛలోక్తి విసిరాడు. ‘అవును, ఈసారి అవి (తెలుపు జాకెట్) బాగా సరిపోతే కచ్చితంగా వేసుకొంటా. గతసారి మేము అందులో జోకర్లలా కనిపించాం. ఎందుకంటే అవి చాలా లూజ్గా ఉన్నాయి మరి' అని కోహ్లీ అన్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ ఎంతో ప్రత్యేకం
అనంతరం ధోని మాట్లాడుతూ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఎంతో ప్రత్యేకమని చెప్పాడు. ఎందుకంటే టోర్నీలో సత్తా చాటేందుకు ఎక్కువ సమయం ఉండదని, వర్షంతో మ్యాచ్లు నిలిపివేస్తున్న పరిస్థితుల్లో ట్రోఫీ గెలవడం చాలా కష్టమని ధోనీ అభిప్రాయపడ్డాడు.

రెండో సెమీఫైనల్లో బంగ్లాతో తలపడనున్న టీమిండియా
ఇక, సెమీస్కు చేరాలంటో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జూన్ 15 (గురువారం) జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్-ఎలో ఉన్న బంగ్లాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే టీమిండియా ఫైనల్కి చేరుకుంది. మరోవైపు తొలి సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు పాక్తో తలపడనుంది.


Click it and Unblock the Notifications