హైదరాబాద్: 2018-19 రంజీ సీజన్లో ఉత్తరాఖండ్కు చెందిన పేసర్ దీపక్ ధపోలా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్లో అరంగేట్రం చేసిన ఉత్తరాఖండ్ తరుపున బరిలోకి దిగిన దీపక్ ధపోలా ఆడిన రెండు మ్యాచ్ల్లో 21 వికెట్లతో సత్తాచాటాడు. అద్భుతమైన పేస్కు తోడు స్వింగ్తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ముప్పుతిప్పలు పెడుతున్నాడు.
17 ఏళ్ల తర్వాత లంకలో టెస్టు సిరిస్ నెగ్గిన ఇంగ్లాండ్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోచ్ రాజ్కుమార్ శర్మ శిక్షణలో రాటుదేలిన దీపక్ ధపోలా తన క్రికెట్ కెరీర్లో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని ఈస్థాయికి చేరుకున్నాడు. గత తొమ్మిదేళ్లుగా ఢిల్లీ రంజీ జట్టు సభ్యుడైన ఈ ఫాస్ట్బౌలర్ ఏనాడు తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఈ సీజన్లో తన సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఈ సందర్భంగా హిందుస్థాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్యూలో కోహ్లీ కూడా వచ్చి తమతో కలిసి ప్రాక్టీస్ చేసేవాడని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. తరచూ అవకాశాలు రాకపోయినప్పటికీ, వచ్చిన అవకాశాల్ని వినియోగించు కోవాలని, ప్రాక్టీస్ చేయడం మాత్రం ఆపొద్దని అప్పట్లో కోహ్లీ తనతో చెప్పేవాడని దీపక్ గుర్తు చేసుకున్నాడు.