మొహాలీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్కు సుధీర్ గౌతమ్ ఎలాంటి అభిమానో... మహేంద్ర సింగ్ ధోనీకి రాంబాబు అనే వ్యక్తి అంతే అభిమాని. ఎక్కడ క్రికెట్ మ్యాచులు ఉంటే అక్కడకు వెళ్లి చూస్తుంటారు. ధోనీ అభిమాని రాంబాబు స్వస్థలం మొహాలీ.
అతను భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ తొలిరోజు స్టేడియంకు వచ్చాడు. అతను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాడు. 'మిస్ యు ధోనీ' అని తన చాతి పైన రాసుకొని కనిపించాడు.

తాను ధోనీకి పెద్ద అభిమానిని అని, అతనే తనకు ట్వంటీ 20, వన్డేలు, టెస్టులు చూడడానికి వెళ్లడం కోసం డబ్బులు ఇచ్చాడని చెప్పాడు. క్రికెట్ ఎప్పటికీ పాషన్ అని, ధోనీ తన హీరో అని చెప్పాడు.
తాను మొహాలీలో 1997-98 నుంచి మ్యాచులు చూస్తున్నట్లుగా గుర్తు ఉందని, అయితే దేశంలోని పలు నగరాలకు తిరుగుతూ చూడటం మాత్రం 2008-09 నుంచి మొదలైందన్నాడు. తాను స్టేడియంలో ఉండి మ్యాచ్ చూసేందుకు, భారత జట్టు గెలవడం గొప్పగా ఫీల్ అవుతానని చెప్పాడు.