హైదరాబాద్: ముంబైకి చెందిన 19 ఏళ్ల క్రికెటర్ రుద్ర దాండే సంచలన సృష్టించాడు. టీ20 మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించాడు. 67 బంతుల్లో 21 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 200 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ముంబై యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రికెట్ టోర్నమెంట్ ముంబైలోని మాతుంగ జింఖానా గ్రౌండ్లో జరిగింది.

ఈ టోర్నీలో భాగంగా గురువారం పి దాల్మియా, రిజ్వి కళాశాలల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రిజ్వి జట్టు ఓపెనర్గా బరిలోకి దిగి దండే అద్భుత ఇన్నింగ్స్తో 39 బంతుల్లో సెంచరీని సాధించాడు. అనంతరం డబుల్ సెంచరీ చేశాడు. దీంతో రిజ్వి జట్టు స్కోరు 2 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది.