గంగూలీ శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో బాదుడు:
1999వ సంవత్సరం వన్డే ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలో.. గంగూలీ శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో వీర బాదుడు బాది 183 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఈ ప్రపంచ కప్లో భారత్ గెలవలేకపోయనప్పటికీ ఈ స్కోరు భారత్ను ప్రపంచ కప్ టోర్నీ నుంచి వెంటనే వైదొలగకుండా కాపాడింది.
ధోనీ కూడా అదే శ్రీలంకపైనే 2005లో:
గంగూలీతో పాటు ధనాదన్ ధోనీ కూడా అదే శ్రీలంకపైనే 2005వ సంవత్సరంలో అంతే స్కోరును నమోదు చేశాడు. 300 టార్గెట్ నమోదు చేసిన శ్రీలంకపై చేధనకు దిగిన టీమిండియా ధోనీ ఇన్నింగ్స్తో లంకను సునాయాసంగా ఎదుర్కొంది. ఆరు వికెట్ల తేడాతో విజయం పొందింది. ఈ విజయంతో ఏడు మ్యాచ్ల సిరీస్లో 7-0తో ఆధిక్యం పొందింది. ఆ తర్వాత సిరీస్ మొత్తానికి 6-1 తో విజయం సాధించింది.
వీరి రికార్డుకు కోహ్లీ 2012లో:
వీరిద్దరి రికార్డుకు కోహ్లీ 2012లో చేరుకున్నాడు. ఆసియా కప్ టోర్నీలో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ తానొక్కడే 183పరుగులు నమోదు చేశాడు. విరాట్ ప్రతాపానికి ఫైనల్ చేరుకునేందుకు ఆశలు సజీవంగా మిగిలాయి.
స్టార్ క్రికెటర్లుగా మారకముందే:
ఇంకో విషయం ఏమంటే వీరు ముగ్గురు స్టార్ క్రికెటర్లుగా మారకముందే ఇంత స్కోరు నమోదు చేయడం విశేషం. దీంతో పాటు గంగూలీ కెప్టెన్గా ఉన్నప్పుడు ధోనీ స్కోరును నమోదు చేస్తే.. ధోనీ కెప్టెన్గా ఉన్నప్పుడు కోహ్లీ ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.