
టోర్నీలో భాగంగా గురువారం బారాముల్లా, బుద్గాం జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో జహంగీర్ అహ్మద్(18) బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బలమైన రాకాసి బౌన్సర్ అతడి మెడను తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. మ్యాచ్ నిర్వాహకులు, సహచర క్రికెటర్లు హుటాహుటిన జహంగీర్ను ఆసుపత్రికి తరలించేలోపే మార్గం మధ్యలో అతడు మృతి చెందాడు.
కాగా, జహంగీర్ బారాముల్లాలో గోస్బుగ్ పట్టన్లోని గవర్నమెంట్ సెకండరీ స్కూల్లో 11వ తరగతి చదువుతున్నాడు. ఎడమచేతివాటం బ్యాట్స్మన్ అయని జహంగీర్ రక్షణ కోసం హెల్మెట్ ధరించినప్పటికీ బౌన్సర్కు బల్యాయడు. కాగా, జహంగీర్ మృతిపై ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంతాపం తెలిపారు.