హైదరాబాద్: బీసీసీఐ నిర్వహిస్తున్న అండర్-19 మహిళల వన్డే క్రికెట్ టోర్నీలో అరుదైన రికార్డు నమోదైంది. ముంబైకి చెందిన మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగెజ్ డబుల్ సెంచరీ సాధించింది. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో 16 ఏళ్ల ఈ బ్యాట్స్ ఉమన్ 161 బంతుల్లో 21 ఫోర్ల సాయంతో 202 పరుగులు చేసింది.
ముంబైకి కెప్టెన్గా ఉన్న జెమిమా రోడ్రిగెజ్ ఈ మ్యాచ్లో నాటౌట్గా నిలిచింది. దీంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర జట్టు 39.4 ఓవర్లకు 62 పరుగులకే ఆలౌటైంది. ముంబై బౌలర్లు సయాలి (3/20), జాన్వీ కేట్ (2), ఫాతిమా జాఫర్ (2) రాణించారు.
Mumbai’s Jemimah Rodrigues, aged 16, made 202* in 163 balls, in the Women's 50 over tournament at Aurangabad vs Saurashtra#starinthemaking pic.twitter.com/fyYBjA0WBz
— Mohandas Menon (@mohanstatsman) 5 November 2017
ఇక జెమిమా రోడ్రిగెజ్ విషయానికి వస్తే బౌలర్గా తన కెరీర్ను ఆరంభించింది. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు సెంచరీలు సాధించింది. ప్రస్తుతం జట్టులో ఓపెనర్గా లేదా వన్ డౌన్లో బ్యాటింగ్కు వస్తుంది. ముంబై తరఫున అండర్-17 హాకీ టోర్నీలో కూడా రోడ్రిగెజ్ ఆడటం విశేషం.
Jemimah Rodrigues...
— Mohandas Menon (@mohanstatsman) 5 November 2017
53 runs in 52 balls
100 runs in 83 balls
153 runs in 116 balls
202* runs in 163 balls
Put on 300 2nd wkt with S Raut
End Innings: Mumbai - 347/2 in 49.6 overs (Jemimah R 202 off 161, J R Pawar 8 off 13) #SAUvMUM @paytm #U19Oneday #League
— BCCI Women (@BCCIWomen) 5 November 2017