
12ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున
12ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున (సెప్టెంబర్ 19) టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాది పీడకల మిగిల్చాడు.

తప్పక గెలవాల్సిన మ్యాచ్లో
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాప్ అనవసరంగా యువీని రెచ్చగొట్టి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్లో స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19వ ఓవర్లో యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు సాధించడంతో పాటు 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.

16 బంతుల్లో 58 పరుగులు
ఈ మ్యాచ్లో యువీ 16 బంతుల్లో 58 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. భారత ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (68), గౌతం గంభీర్ (58) అద్భుతమై ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఔటయ్యారు. అనంతరం 19 పరుగుల వ్యవధిలో వీరిద్దరితో పాటు రాబిన్ ఊతప్ప(6) ఔటయ్యాక.. కెప్టెన్ ధోనీ(10), యువరాజ్(58) క్రీజులోకి వచ్చారు.

నాలుగో వికెట్కు 61 పరుగులు
చివరి మూడు ఓవర్లలో వీరిద్దరూ నాలుగో వికెట్కు 61 పరుగులు జోడించగా యువరాజ్ సింగ్ ఏకంగా 16 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు. 19వ ఓవర్ ఐదో బంతికి ఫ్లింటాప్ బౌలింగ్లో కాలింగ్వుడ్ చేతికి చిక్కి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్పై టీమిండియా 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.


Click it and Unblock the Notifications












