Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యు 'వీరం': భారత్ విజయం

Yuvraj Singh
కింగ్‌ స్టన్‌: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌ విధించిన 340 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ 319 పరుగులకు ఆలౌటు అయింది. చందర్‌పాల్‌ 63(59), సర్వాన్‌ 45(42), మోర్టాన్‌ 42(51), గేల్‌ 37(33) పరుగులతో రాణించారు. భారత్‌ బౌలర్లలో నెహ్రా, పఠాన్‌ మూడేసి వికెట్లు, ఆర్పీసింగ్‌, ఇషాంత్‌ శర్మ, హర్భజన్‌సింగ్‌ ఒక్కో వికెట్‌ తీశారు. అద్భుతమైన సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చిన యువరాజ్‌ కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ లభించింది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ యువరాజ్‌ సింగ్‌ సెంచరీతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోరు చేసింది. 32 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన భారత్‌ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. గంభీర్‌ 13, రోహిత్‌ శర్మ 4 పరుగులకు అవుటయ్యారు. ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన యువరాజ్‌ ఓపెనర్‌ కార్తీక్‌తో కలిసి ఆచితూచి ఆడాడు. ఇద్దరూ సమన్వయంతో ఆడుతూ స్కోరు వేగం పెంచారు. 28 ఓవర్‌లో కార్తీక్‌ 67 పరుగులకు అవుటయ్యాడు. యూవీకి కెప్టెన్‌ ధోని జత కలిశాడు. వీరిద్దరూ స్కోరును 253కు తీసుకెళ్లారు. ఈ సమయంలో యువీ 131 పరుగుల వద్ద అవుటయ్యాడు. 102 బంతుల్లో యువరాజ్‌ ఈ స్కోర్‌ సాధించాడు. వన్డేల్లో యూవీకి ఇది 12వ సెంచరీ. ధోని 41, జడేజా పరుగులేవీ చేయకుండా అవుటయ్యారు. యూసఫ్‌ పఠాన్‌ 40, హర్భజన్‌ 22 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. టేలర్‌ 1, బాకర్‌ 1, బ్రావో 2, బెర్నార్డ్‌ 1 వికెట్‌ చొప్పున తీసుకున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+