న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళా బాక్సర్‌పై దాడి.. దుండగుడు అరెస్ట్

Woman Boxer Suman Kumari Alleges Assault While On Her Way To Work In Kolkata

కోల్‌కతాకు చెందిన అంతర్జాతీయ మహిళా బాక్సర్‌ సుమన్‌ కుమారిపై ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. దక్షిణ కోల్‌కతాలోని మోమిన్‌పూర్ ప్రాంతంలో ఉదయం ఈ ఘటన జరిగినట్టు బాక్సర్ సుమన్‌ తన ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించింది. దుండగుడు తనను దుర్భాషలాడడమే గాకుండా భౌతికంగా దాడికి పాల్పడ్డాడని తెలిపింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

సుమన్‌ కుమారి ఉదయం 11 గంటలకు స్కూటీపై ఆఫీసుకు వెళుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు అడ్డొచ్చాడు. అతికష్టమ్మీద స్కూటీని ఆపినా.. ఆ వ్యక్తి దుర్భాషలాడాడు. ఎందుకు తిడుతున్నావని అడగడంతో అతను హఠాత్తుగా సుమన్‌ గొంతు పట్టుకొన్నాడు. పక్కనే ఉన్న పోలీసును పిలిచినా అతను పట్టించుకోలేదు.

'నాకింకా కోల్‌కతా పోలీసులపై నమ్మకం ఉంది. ఈ విషయాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా న్యాయం చేయాలని కోరుతున్నా. అప్పుడే కోల్‌కతా నగరంలో మహిళలు స్వేచ్ఛగా తిరగగలరు' అని సుమన్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని అరెస్టు చేశారు.

జూన్ 18న మిస్ ఇండియా ఉషోషి సేన్‌గుప్తా కూడా ఇదే విధంగా దాడికి గురయ్యారు. కోల్‌కతాలోని ఓ యువకుల మూక బైక్ మీద వచ్చి దాడి చేశారని సోషల్ మీడియా వేదికగా ఉషోషి వెల్లడించారు. ఈ రెండు ఘటనతో కోల్‌కతా నగరంలోని పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Story first published: Sunday, June 30, 2019, 15:51 [IST]
Other articles published on Jun 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X