బ్రిటీష్ బాక్సర్ షెరీఫ్ లావెల్ తన అరంగేట్ర మ్యాచ్ అనంతరం మరణించిన విషయం తెలిసిందే. లండన్ వేదికగా మేలో జరిగిన ఆరు రౌండ్ల మిడిల్ వెయిల్ ఫైట్లో నాలుగో రౌండ్లో తలకు దెబ్బ తగిలి 29 ఏళ్ల షెరీఫ్ కుప్పకూలాడు. అనంతరం వైద్య సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరించారు. కానీ అతను ప్రాణాలు కోల్పోయాడు.
అనంతరం పోరాటంలో షెరీఫ్ ప్రాణాలు కోల్పోయాడని వారెన్ బాక్సింగ్ మేనేజ్మెంట్ ప్రకటన విడుదుల చేసింది. వైద్యులు అతని ప్రాణాలు కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదని తెలిపింది. షెరీఫ్ కుటుంబానికి, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. బ్రిటిష్ బాక్సింగ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కూడా సంతాపం వ్యక్తం చేసింది.

అయితే షెరీఫ్ లావెల్ మృతిలో కొత్త వార్త బయటకు వచ్చింది. షెరీఫ్ది సహజ మరణంగా భావిస్తున్నామని, మృతి పట్ల ఎలాంటి విచారణ చేపట్లేదని హారింగే బరో కౌన్సిల్ తెలిపింది. పోర్చుగీస్ బాక్సర్ మలమ్తో జరిగిన ఫైట్ అనంతరం మే 12న షెరీఫ్ మరణించిన విషయం తెలిసిందే. 1884లో మార్క్వెస్ ఆఫ్ క్వీన్స్బెర్రీ రూల్స్ను ప్రవేశపెట్టిన అనంతరం, భద్రతా చర్యలు గణనీయంగా మెరుగైనప్పటికీ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. రూల్స్ అమల్లోకి వచ్చినప్పటి నుండి సుమారు 500 మంది బాక్సర్లు రింగ్లో లేదా బాక్సింగ్ ఫలితంగా మరణించినట్లు రికార్డులు చూపిస్తున్నాయి.