టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్లో
తాజాగా, బుధవారం ఢిల్లీ వేదికగా జరిగిన ఓ అథ్లెటిక్స్ ఈవెంట్కి హాజరైన మేరీకోమ్ 2020లో టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గడమే తన తదుపరి లక్ష్యమని వెల్లడించింది. ఈ సందర్భంగా మేరీ కోమ్ మాట్లాడుతూ "ఒలింపిక్స్లో ఇప్పటికే నేను ఒక పతకం గెలిచాను (2012లో కాంస్యం). అయితే, స్వర్ణ పతకం గెలవడం నా కల" అని పేర్కొంది.
స్వర్ణం నెగ్గడం చాలా సంతోషంగా ఉంది
"ఇటీవలే ముగిసిన ప్రపంచ ఛాంపియన్షిప్లో విజేతగా నిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ గెలుపు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ప్రస్తుతం నా లక్ష్యం టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం గెలవడమే. దేశానికి ఆ పతకం అందించేందుకు ఎంత శ్రమకమైన నేను సిద్ధమే" అని మేరీకోమ్ చెప్పుకొచ్చింది.
ఒలింపిక్స్లో 51 కేజీల విభాగంలో
టోక్యో ఒలింపిక్స్లో బాక్సింగ్లో 48 కేజీల విభాగంలో పోటీలు ఉండవు. దీంతో మేరీకోమ్ 51 కేజీల విభాగంలోకి మారాల్సి ఉంటుంది. ఇటీవలే ముగిసిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 48 కేజీల విభాగంలో పోటీపడి మేరీ కోమ్ స్వర్ణం నెగ్గిన సంగతి తెలిసిందే.