హైదరాబాద్: 2020 టోక్యో ఒలింపిక్స్లో తాను గోల్డ్ మెడల్ సాధిస్తానని దేశం మొత్తం భావిస్తోందని బాక్సింగ్లో ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన స్టార్ బాక్సర్ మేరీ కోమ్ అన్నారు. ప్రస్తుతం మేరీ కోమ్ 2020 టోక్యో ఒలింపిక్స్కి అర్హత సాధించేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఇంగ్లాండ్ ఛాంప్స్, ఆసీస్ చీట్స్: యాషెస్లో తొలిరోజే ఇంగ్లీషు ఫ్యాన్స్ ఎగతాళి
అయితే, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు శక్తివంచన లేకుండా కృష్టి చేస్తానని మేరీ కోమ్ తెలిపింది. ఇటీవల జరిగిన ప్రెసిడెంట్స్ కప్లో మేరీ కోమ్ బంగారు పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో టోక్యో ఒలింపిక్స్లో ఆమె కచ్చితంగా బంగారు పతకం సాధిస్తుందని నమ్మకం పెట్టుకున్నారు.
దీనిపై గురువారం ఎఎన్ఐకి ఇచ్చిన ఇంటర్యూలో మేరీ కోమ్ మాట్లాడుతూ "రాబోయే ఒలింపిక్స్లో నేను గోల్డ్ మెడల్ సాధిస్తానని దేశం మొత్తం భావిస్తోంది. ప్రజలు నాపై పెట్టకున్న నమ్మకానికి గర్వంగా ఉంది. అయితే అంచనాలు వేయడం సులువే కానీ.. ఆ లక్ష్యాలను చేరాలంటే శ్రమించాల్సి ఉంటుంది. ప్రజలు నాపై పెట్టుకున్న అంచనాల్ని నిజం చేయడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా" అని అన్నారు.
కేపీఎల్ 8వ సీజన్ తేదీ వచ్చేసింది!: పూర్తి షెడ్యూల్, వేదికల వివరాలివే
లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన మేరీ కోమ్ రాబోయే ఒలింపిక్స్కు అర్హత సాధించడం కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. "ముఖ్యమైన అంశాలలో అర్హత సాధించడం కూడా ఒకటి, నేను అర్హత సాధించిన తర్వాత, ఇంకా మెరుగవుతాను. దేశం నా నుండి ఏమి ఆశిస్తుందో... దానిని సాధించేందుకు నేను ఉత్తమ ప్రయత్నం చేస్తాను" అని మేరీ కోమ్ తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్లో కేటగిరీ మారడం పెద్ద సమస్య కాదని మేరీ కోమ్ తెలిపారు. 2020 టోక్యో ఒలింపిక్స్లో 51 కేజీల కేటగిరి లేకపోవడంతో 48 కేజీల కేటగిరిలో పోటీ చేయడానికి కసరత్తు ప్రారంభించినట్లు మేరీకోమ్ ఈ సందర్భంగా వెల్లడించారు.