న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌: ఫైనల్లో మంజురాణి ఓటమి

Manju Rani

హైదరాబాద్: రష్యా వేదికగా జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్ మహిళా బాక్సర్ మంజురాణి ఓటమిపాలైంది. 48 కేజీల విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో రష్యా బాక్సర్‌ ఎకతెరిన పాల్సివ చేతిలో మంజురాణి 4-1తేడాతో ఓడిపోయింది.

దీంతో మంజురాణి వెండి పతకంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన సెమీస్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన చతామత్‌ రక్‌సాత్‌ను 4-1తో ఓడించి తొలిసారి మంజురాణి ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌‌లో ప్రవేశించింది. ఈ క్రమంలో ఈ ఛాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల వయస్సులోనే ఫైనల్స్‌లో ప్రవేశించిన మొదటి మహిళగా మంజురాణి రికార్డు సృష్టించింది.

కాగా, శనివారం జరిగిన సెమీఫైనల్లో మేరీకోమ్‌ 51 కేజీల విభాగంలో, జమున 54 కేజీల విభాగంలో, లోవ్లినా 69 కేజీల విభాగాల్లో ఓడిపోయారు. దీంతో వీరు కాంస్య పతకాలతో సరి పెట్టుకున్నారు.

Story first published: Sunday, October 13, 2019, 14:59 [IST]
Other articles published on Oct 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X