హైదరాబాద్: రష్యా వేదికగా జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ మహిళా బాక్సర్ మంజురాణి ఓటమిపాలైంది. 48 కేజీల విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో రష్యా బాక్సర్ ఎకతెరిన పాల్సివ చేతిలో మంజురాణి 4-1తేడాతో ఓడిపోయింది.
దీంతో మంజురాణి వెండి పతకంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన సెమీస్లో థాయ్లాండ్కు చెందిన చతామత్ రక్సాత్ను 4-1తో ఓడించి తొలిసారి మంజురాణి ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ప్రవేశించింది. ఈ క్రమంలో ఈ ఛాంపియన్షిప్లో 18 ఏళ్ల వయస్సులోనే ఫైనల్స్లో ప్రవేశించిన మొదటి మహిళగా మంజురాణి రికార్డు సృష్టించింది.
Manju Rani loses finals of Women's World Boxing Championships, wins silver
— ANI Digital (@ani_digital) October 13, 2019
Read @ANI story | https://t.co/uuN22XKuIg pic.twitter.com/M5DB2Haq7J
కాగా, శనివారం జరిగిన సెమీఫైనల్లో మేరీకోమ్ 51 కేజీల విభాగంలో, జమున 54 కేజీల విభాగంలో, లోవ్లినా 69 కేజీల విభాగాల్లో ఓడిపోయారు. దీంతో వీరు కాంస్య పతకాలతో సరి పెట్టుకున్నారు.