హైదరాబాద్: భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్కు అరుదైన ఘనత లభించింది. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఏఐబీఏ) గురువారం ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్లో మేరీ కోమ్ వరల్డ్ నంబర్ వన్గా నిలిచింది. గతేడాది నవంబర్లో ఢిల్లీ వేదికగా జరిగిన ఏఐబీఏ మహిళా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ఫిప్లో 48 కేజీల విభాగంలో మేరీ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే.
భారత్తో వన్డే సిరిస్కు 1980నాటి జెర్సీలతో ఆస్ట్రేలియా (వీడియో)
మేరీ కోమ్కు ఇది ఆరో వరల్డ్ చాంపియన్షిప్ టైటిల్ కావడం విశేషం. దీంతో తాజా ర్యాంకింగ్స్లో మేరీ కోమ్ నంబర్ వన్ ర్యాంకులోకి దూసుకెళ్లింది. ఈ కేటగిరీలో 1700 పాయింట్లతో మేరీ కోమ్ అగ్రస్థానంలో ఉంది. అయితే, 2020లో జరగబోయే ఒలింపిక్స్లో మేరీ కోమ్ 51 కేజీల విభాగంలో పొటీ పడుతుంది. టోక్యో ఒలింపిక్స్లో 48 కేజీల విభాగాన్ని తొలగించారు.
2018 మేరీకోమ్ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. గతేడాది జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సాధించిన మేరీ కోమ్.. స్ట్రాంజ్జా మెమోరియల్ పోటీల్లో రజత పతకాన్ని సాధించింది. ఏఐబీఏ ప్రకటించిన ర్యాంకింగ్స్లో మేరీతో పాటు మరికొందరు మహిళా బాక్సర్లు అత్యుత్తమ ర్యాంకులు సంపాదించుకున్నారు.
51 కేజీల విభాగంలో పింకీ జంగ్రా ఎనిమిదో స్థానంలో నిలవగా..... ఆసియా క్రీడల్లో రజతం సాధించిన మనీషా మాన్ 54 కేజీల విభాగంలో ఎనిమిదో స్థానాన్ని సొంతం చేసుకుంది. 57 కేజీల విభాగంలో సోనియా లాథర్ రెండో స్థానంలో నిలిచింది. మరో బాక్సర్ సిమ్రంజిత్ కౌర్ 64 కేజీల విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది.