హైదరాబాద్: ఒలింపిక్స్కు అర్హత సాధించడం కోసమే ఆసియా ఛాంపియన్షిప్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్టు భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ వెల్లడించింది. ప్రస్తుతం తన విభాగంలో ఒలింపిక్స్కు అర్హత సాధించడం కష్టమని, అందుకే ప్రణాళికా బద్దంగా టోర్నీలను ఎంపిక చేసుకుంటున్నట్టు మేరీ కోమ్ తెలిపింది.
బుమ్రా ఆడాలి.. ఇంట్లో కూర్చోకూడదు: పనిభారంపై జయవర్దనే
ఆరోసారి వరల్డ్ ఛాంపియన్ టైటిల్ నెగ్గిన మేరీ కోమ్ టోక్యో ఒలింపిక్స్ బెర్త్ కోసం రష్యాలోని ఏకతెరింగ్బర్గ్లో జరిగే ప్రపంచ చాంపియన్షిప్లో పాల్గొనాలని నిశ్చయించింది. ఇందుకోసం ఏప్రిల్లో థాయిలాండ్ వేదికగా జరగనున్న ఆసియా ఛాంపియన్షిప్ నుంచి వైదొలగాలని నిర్ణయిం తీసుకుంది.
"ఈ ఏడాది నాకు ఎంతో కీలకం. ఒలింపిక్స్కు అర్హత సాధించడమే నా తొలి ప్రాధాన్యం. ప్రతి టోర్నీలో పాల్గొనాల్సి ఉంటుంది. 51 కిలోల విభాగంలో పోటీ చాలా తీవ్రంగా ఉంది. తొలుత ఇండియా ఓపెన్లో పాల్గొని ఆ తర్వాత 51 కేజీల విభాగంలో వీలైనన్ని టోర్నీలలో గెలుపొంది ఒలింపిక్స్కు అర్హత సాధించాలి" అని మేరీ కోమ్ తెలిపింది.
2020 టోక్యో ఒలింపిక్స్ను దృష్టిలో ఉంచుకుని భారత స్టార్ బాక్సర్ల తమ కేటగిరీలను మార్చుకున్న సంగతి తెలిసిందే. అమిత్ పాంగల్, శివ థాపా, మనీష్ కౌశిక్వంటి బాక్సర్లు పోటీ చేసే ప్రస్తుత కేటగిరీలను అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్(ఐబా) రద్దు చేసింది.
దీంతో 2020 టోక్యో ఒలింపిక్స్లో అమిత్ ఫంగాల్ (49 కిలోలు), శివ థాపా, మనీష్ కౌశిక్ (60 కిలోలు) తమ బరువు విభాగాలను మార్చుకోనున్నారు. టోక్యో ఒలింపిక్స్లో పురుషుల విభాగంలో 52, 57, 63, 69, 75, 81, 91, 91+, మహిళల విభాగంలో 51, 57, 64, 69, 75 కిలోల విభాగాల్లో పోటీలుంటాయి.