బ్యాంకాక్ వేదికగా జరిగే ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ క్వార్టర్ ఫైనల్కు చేరింది. ఆదివారం మహిళల 51 కేజీల తొలి రౌండ్లో నిఖత్ కంబోడియాకు చెందిన స్రెయ్పొవ్ను ఓడించింది. బౌట్ ఆరంభం నుంచి పంచ్ల వర్షం కురిపించిన నిఖత్.. ప్రత్యర్థిని రెండో రౌండ్కే నాకౌట్ చేసింది. ఈ విజయంతో నిఖత్ క్వార్టర్ ఫైనల్కు చేరింది.
మహిళల విభాగంలో సరితా దేవి (60 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. గ్వాన్ సుజిన్ (కొరియా)తో జరిగిన బౌట్లో సరితా పంచ్ల దాటికి రిఫరీ మూడో రౌండ్లో బౌట్ను ముగించాడు. పురుషుల విభాగంలో అమిత్ (52 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), శివ థాపా (60 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. బ్రిజేష్ యాదవ్ (81 కేజీలు) 0-4తో రుజ్మెతోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓటమిని చవిచూశాడు.