హైదరాబాద్: ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు సత్తా చాటారు. తాజాగా, శుక్రవారం భారత్ ఖాతాకు రెండు స్వర్ణాలు దక్కాయి. భారత బాక్సర్ అమిత్ పంఘాల్ స్వర్ణ పతకం సాధించాడు. పురుషుల 52 కేజీల విభాగంలో అమిత్ పంఘాల్ కొరియాకు చెందిన డు కిమ్ ఇంక్యూను చిత్తుగా ఓడించాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఏకపక్షంగా సాగిన ఈ పోరులో 5-0 తేడాతో పంఘాల్ విజయం సాధించాడు. కాగా, గతేడాది జరిగిన ఆసియన్ గేమ్స్లోనూ పంఘాల్ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్లో కూడా పంఘాల్ స్వర్ణం సాధించాడు.
మరోవైపు పురుషుల 56 కేజీల విభాగంలో కవిందర్ సింగ్ బిస్త్ స్వర్ణం సాధించాడు. మంగోలియన్కు చెందిన అమర్ ఖఖూపై 3-2తేడాతో కవిందర్ సింగ్ బిస్త్ గెలుపొందాడు. భారత ఆటగాళ్లు కవీందర్ సింగ్ బిష్త్, దీపక్ సింగ్లు ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నారు.