
తొలిసారి ఫైనల్కు చేరే అవకాశం
దీంతో వరుస రెండు గేమ్లతో పాటు మ్యాచ్ను చేజార్చుకుని ఆసియా గేమ్స్లో తొలిసారి ఫైనల్కు చేరే అవకాశాన్ని కోల్పోయింది. తైజు ఇంగ్ చేతిలో సైనా నెహ్వాల్ ఓడటం ఇది వరుసగా పదోసారి కావడం గమనార్హం. ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్ సెమీస్లో ఓటమి అనంతరం సైనా మీడియాతో మాట్లాడారు.

ర్యాలీలు ముగించడంలో నేనింకా వేగంగా
"తైజుతో మ్యాచ్లో షాట్లు కొట్టడంలో, ర్యాలీలు ముగించడంలో నేనింకా వేగంగా చురుగ్గా స్పందించాల్సింది. ఎక్కడో ఓ చోట ఆమె ప్రత్యర్థిని అందుకుంటుంది. ఆమెతో ప్రతి ర్యాలీ విభిన్నమే. చాలా మంది క్రీడాకారులకు ఒక ప్యాటర్న్ ఉంటుంది. కానీ తైజు వద్ద ఇంకా భిన్నమైన షాట్లు ఉన్నాయి. ఆమెను అర్థం చేసుకోలేపోతున్నా" అని తెలిపింది.

కోచ్లకు సైతం ఆమె కొరకరాని కొయ్య
"కోచ్లకు సైతం ఆమె కొరకరాని కొయ్య. ఆమెను అర్థం చేసుకోవాలని ప్రయత్నించే లోపే సరికొత్త షాట్తో వచ్చేస్తోంది. సెమీస్లో నేను బాగానే ఆడా. ఆమె నా కన్నా ఎంతో మెరుగ్గా ఆడింది. ఆమెతో మ్యాచ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి" అని సైనా నెహ్వాల్ పేర్కొంది. సెమీస్లో తైజు ఇంగ్ను ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నించానని సైనా తెలిపారు.

ప్రత్యర్థి నాకన్నా బాగా ఆడటంతోనే ఓటమి
అయితే, ప్రత్యర్థి తనకన్న బాగా ఆడటంతో ఓటమి తప్పలేదన్నారు. ఆసియా గేమ్స్ల్లో తొలిసారి పతకం గెలిచినందుకు ఆనందంగా ఉందని సైనా వెల్లడించింది. అన్సీడెడ్గా బరిలోకి దిగిన తనకు డ్రా కొంత మేలు చేసిందని సైనా తెలిపింది. ఆసియా గేమ్స్ ఒలింపిక్స్లాంటివే అని ఇక్కడ కరోలినా మారిన్ మాత్రమే ఉండదని సైనా పేర్కొంది. తైజుతో ఫైనల్లో సింధుకు 50-50 అవకాశాలు ఉన్నాయని సైనా చెప్పింది.


Click it and Unblock the Notifications












