న్యూఢిల్లీ: బాసెల్ (స్విట్జర్లాండ్) వేదికగా వచ్చే వారంలో జరుగనున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులు ముఖాముఖి పోరులో తలపడనున్నారు. ఇద్దరు సెమీఫైనల్లో ఎదురుపడే అవకాశముంది. ఈ మెగా టోర్నీ మహిళల సింగిల్స్ డ్రాను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తిరిగి తీసింది. ఈ డ్రా ప్రకారం సింధు, సైనా ఒకే పార్శ్వం నుంచి బరిలోకి దిగుతున్నారు.
విండీస్తో భారత్ రెండో వన్డే.. వరుణుడు కరుణిస్తేనే మ్యాచ్
మహిళల సింగిల్స్లో డోపింగ్ నిషేధం ఎదుర్కొంటున్న మారిషస్కు చెందిన క్రీడాకారిణి కేట్ కునె పేరును పొరపాటున చేర్చడాన్ని గుర్తించిన బీడబ్ల్యూఎఫ్ శనివారం తిరిగి డ్రా తీసింది. మిగిలిన నాలుగు విభాగాల్లో ఎలాంటి మార్పు చేయలేదని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది. సవరించిన డ్రా ప్రకారం సింధు, సైనా ఒకే పార్శ్వంలో ఉన్నారు. దీంతో ఇద్దరు సెమీఫైనల్లో ఎదురుపడే అవకాశముంది.
BREAKING | BWF has conducted a re-draw of the women’s singles category at the TOTAL BWF World Championships 2019 in Basel, Switzerland @basel2019ofcl
— BWF (@bwfmedia) August 9, 2019
👉 MORE: https://t.co/KnLBXKYGr8#TOTALBWFWC2019 #Basel2019 pic.twitter.com/yTLfIkcrSO
ఐదో సీడ్గా బరిలోకి దిగుతున్న సింధుకు తొలి రౌండ్లో బై లభించింది. పై యు పో లేదా లిండా జెచిరితో సింధు రెండో రౌండ్లో ఆడుతుంది. ఇక ఎనిమిదో సీడ్ సైనా.. సబ్రినా జాక్వెట్, సొరయా డీ విచ్ మధ్య విజేతతో తలపడుతుంది. ఇద్దరు గ్రూపు దశను దాటుకుని వస్తే సెమీస్లో తలపడాల్సి ఉంటుంది. 'మహిళల సింగిల్స్లో పొరపాటుగా ఓ క్రీడాకారిణిని చేర్చారు. దాంతో ఆమె పేరును తొలగించి తిరిగి డ్రా నిర్వహించాం' అని బీడబ్ల్యూఎఫ్ వెల్లడించింది.
అజయ్ ఠాకూర్ విజృంభణ.. గుజరాత్పై తలైవాస్ విజయం
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నుయెన్ (ఐర్లాండ్)తో ఏడో సీడ్ కిదాంబి శ్రీకాంత్ తలపడనున్నాడు. శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశం ఉంది. క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) రూపంలో అసలైన ప్రత్యర్థి ఉంటాడు. ఇక హీనో (ఫిన్లాండ్)తో ప్రణయ్, జేసన్ ఆంథోనీ (కెనడా)తో సాయిప్రణీత్, కీన్ యూ (సింగపూర్)తో సమీర్వర్మ తలపడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజు- చిరాగ్శెట్టి జోడీకి బై లభించింది.