హైదరాబాద్: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత షట్లర్లు దూసుకుపోతున్నారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో సైనా నెహ్వాల్ 21-11, 21-12 స్కోర్తో స్విట్జర్లాండ్కు చెందిన సబ్రినా జాక్వెట్పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.

33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్లో ఆరంభం నుంచి సైనా తన హవాని కొనసాగించింది. తొలి గేమ్ని 21-11తో సొంతం చేసుకున్న సైనా... రెండో గేమ్లో కూడా అదే దూకుడుని ప్రదర్శించి 21-12తో మ్యాచ్ని సొంతం చేసుకుంది. మరో మ్యాచ్లో సాయి ప్రణీత్ థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేశాడు.