హైదరాబాద్: రియో ఒలింపిక్స్లో భారత్కు రజత పతకం అందించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తెలుగుతేజం పీవీ సింధుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి గజాల స్థలం కేటాయించింది. ఒలింపిక్స్ రజత పతకం సాధించినందుకు ప్రభుత్వం నజరానాగా ఈ భూమిని కేటాయించింది.
గురువారం ప్రగతి భవన్లో భూమికి సంబంధించిన పత్రాలను సీఎం కేసీఆర్ సింధుకు అందజేశారు. రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన సందర్భంగా ఆమెకు ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో ఇంటి నిర్మాణం కోసం భూమిని ఇస్తామని ప్రకటించింది.

ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెయ్యి గజాల భూమిని కేటాయించింది. స్థలం కేటాయించినందుకు సింధు, ఆమె తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.