
హైదరాబాద్: ఇండోనేషియా ఓపెన్ ఫైనల్కు దూసుకెళ్లిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్లో సైనా ప్రపంచ నంబర్వన్ తై జు యింగ్ చేతిలో 21-9, 21-13 తేడాతో ఓటమి పాలై టైటిల్ను చేజార్చుకుంది. అంతకుముందు రోజు పీవీ సింధుతో పోరాడి గెలిచిన సైనా అదే జోరును ఫైనల్లో చూపించలేకపోయింది.
ప్రపంచ నంబర్ 1 అయిన ప్రత్యర్థి ముందు తలొంచింది. తొలి గేమ్ నుంచి ఆధిక్యం ప్రదర్శించిన తై జు చివరి వరకూ అదే జోరును కొనసాగించింది. 11-5 పాయింట్ల స్కోరు ఉన్నప్పుడు సైనా ప్రత్యర్థిని అధిగమించాలని తీవ్రంగా శ్రమించింది. ఈ తరుణంలో సైనా చేసిన ప్రతి ప్రయత్నం తై జు కు అనుకూలంగా మారింది. దీంతో ఈ రౌండ్ ముగిసే సరికి 9-16 పాయింట్లతో నిలిచారు.
సైనా కేవలం రెండు భారీ షార్ట్స్ను కొట్టి పాయింట్లను గెలుచుకునే ప్రయత్నంలో తైజు రెండింటిని అందుకోవడంతో బురిడీ కొట్టినట్లైంది.
తై జు ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ టైటిల్ను గెలుచుకున్న తొలి చైనీస్ తైపే క్రీడాకారిణిగా తై జు నిలిచింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.